గూస్బంప్స్ తెప్పిస్తున్న బోర్డర్ 2 టీజర్.. లాహోర్ దద్దరిల్లేలా ఇండియన్ ఆర్మీ గర్జన.. 28 ఏళ్ల తర్వాత సీక్వెల్
బోర్డర్ 2 టీజర్ వచ్చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన అత్యుత్తమ దేశభక్తి, వార్ మూవీస్ లో ఒకటిగా పేరుగాంచిన బోర్డర్ మూవీకి 28 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ ఇది. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ఆనాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా సాగింది.
ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ వార్ మూవీగా నిలిచిన 'బోర్డర్' (1997) చిత్రానికి సీక్వెల్గా వస్తున్న 'బోర్డర్ 2' (Border 2) టీజర్ విడుదలైంది. విజయ్ దివస్ (డిసెంబర్ 16) సందర్భంగా విడుదలైన ఈ టీజర్లో సన్నీ డియోల్ మరోసారి తన పవర్ ప్యాక్డ్ డైలాగ్స్తో అదరగొట్టడం చూడొచ్చు. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టిలతో కూడిన ఈ టీజర్ 1971 యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

బోర్డర్ 2 టీజర్ ఇలా..
దేశభక్తి చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బోర్డర్ 2' టీజర్ మంగళవారం (డిసెంబర్ 16) ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో విడుదలైంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయాన్ని గుర్తుచేసుకునే 'విజయ్ దివస్' రోజున మేకర్స్ ఈ టీజర్ను వదలడం విశేషం.
బోర్డర్ 2 టీజర్ మొదలవ్వడమే 1971 యుద్ధ దృశ్యాలతో మొదలవుతుంది. సన్నీ డియోల్ వాయిస్ ఓవర్తో.. పాకిస్థాన్ సైన్యం ఇండియాలోకి చొరబడటానికి సాహసిస్తే ఏం జరుగుతుందో హెచ్చరిస్తాడు.
తన సైనికులతో సన్నీ చెప్పే డైలాగ్ హైలైట్.. "ఎంత గట్టిగా అరవాలంటే.. ఆ శబ్దం లాహోర్ వరకు వినిపించాలి" అని చెప్పే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. కేవలం నేల మీదే కాకుండా.. ఆకాశంలో, సముద్రం మీద జరిగే యుద్ధ సన్నివేశాలను కూడా టీజర్లో చూపించారు.
టీజర్ చివరలో వచ్చే టైటిల్ కార్డ్ వెనుక.. మొదటి పార్ట్లోని ఐకానిక్ సాంగ్ 'హిందుస్థాన్ మేరీ జాన్' ట్యూన్ వినిపించడం ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తోంది.
బోర్డర్ 2 మూవీ గురించి..
జే.పీ. దత్తా సమర్పణలో అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బోర్డర్ 2 చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి లీడ్ రోల్స్ లో నటించారు. ఇక వీళ్లతోపాటు సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా తదితరులు నటిస్తున్నారు.
రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా జనవరి 23, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 1997లో వచ్చిన 'బోర్డర్' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా అదే స్థాయి అంచనాలతో వస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


