Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఐశ్వర్య గట్టి షాకే ఇవ్వబోతున్నట్లు తేలింది. ఇందుని రాజు ద్వారా కిడ్నాప్ చేయించి తనకు కావాల్సిన డబ్బును సంపాదించాలని భావిస్తుంది. అటు రాజు, లక్కీ కూడా సాహు భయంతో దీనికి ఒప్పుకుంటారు.
సంతకం పెట్టొద్దని చెప్పిన అపర్ణ.. ధైర్యం చెప్పిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్ ఇందుకి అపర్ణ క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్.. ఆ రేఖ ఓ పాము.. రెండు మాటలు బాగా మాట్లాడి.. నాలుగు బట్టలు తెచ్చి తినిపిస్తే ఆమె గుణం మరచిపోయావా అని నిలదీస్తుంది. కానీ ఇందు మాత్రం రేఖ ఏం చేస్తుందో తనకు తెలుసు అని, తన పుట్టిన రోజు నాడు ఆస్తి పత్రాలపై సంతకం కోసమే ఇలా చేస్తోందని అంటుంది.
మరి సంతకం పెడతావా అని అపర్ణ అడుగుతుంది. మిమ్మల్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని ఇందు చెబుతుంది. సంతకం పెట్టకుండా ఎలా కాపాడుకోవాలన్నదే ఆలోచిస్తున్నానని అంటుంది. ఎప్పుడో ప్రమాదంలో చనిపోవాల్సిన వాళ్లం.. ఇంకా బతికి ఉన్నామంటే ఏదో సాధించడానికే.. ఇంత వరకూ కోల్పోయిందే ఎక్కువ.. ఇక అంతా సాధించాల్సిందే అని స్పష్టం చేసి వెళ్లిపోతుంది. ఈ యుద్ధంలో ఇందు ఒంటరిగా మిగిలిపోయిందని సుభాష్, అపర్ణ బాధపడతారు.
రేఖను నిలదీసిన భ్రమరాంబ
అటు భ్రమరాంబ వెళ్లి రేఖను నిలదీస్తుంది. అసలు ఏం చేస్తున్నావ్.. ఆ ఆస్తి నీదని చెప్పే నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావ్.. తర్వాత ఇందు పేరు మీద ఉందని తెలిసింది.. సరే 20 ఏళ్లు ఆగిన తర్వాతైనా వస్తుంది కదా అని అనుకుంటే.. ఇప్పుడు దానిపై అంతలా ప్రేమ కురిపిస్తున్నావ్.. నీ తల్లి, అన్నలను చంపిన కావ్య కూతురు అది.. దానిపై అంత ప్రేమ ఎందుకు అని అడుగుతుంది.
దీంతో రేఖ అసలు ప్లాన్ చెబుతుంది. మరో రెండు రోజుల్లో దాని పుట్టిన రోజు రాబోతోంది.. ఆ రోజే ఆస్తి పేపర్లపై సంతకం పెట్టిస్తాను.. దీంతో ఆస్తి మొత్తం మనది అవుతుంది.. అందుకే దానితో అలా ప్రేమగా ఉన్నానని రేఖ చెప్పడంతో భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది.
ఇందుకు ఫోన్ చేసి తిట్టిన రాజు
{{/usCountry}}దీంతో రేఖ అసలు ప్లాన్ చెబుతుంది. మరో రెండు రోజుల్లో దాని పుట్టిన రోజు రాబోతోంది.. ఆ రోజే ఆస్తి పేపర్లపై సంతకం పెట్టిస్తాను.. దీంతో ఆస్తి మొత్తం మనది అవుతుంది.. అందుకే దానితో అలా ప్రేమగా ఉన్నానని రేఖ చెప్పడంతో భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది.
ఇందుకు ఫోన్ చేసి తిట్టిన రాజు
{{/usCountry}}మరోవైపు రాజు, లక్కీ నిండా మునిగామంటూ ఏడుస్తూ మందు తాగుతుంటారు. రూ.10 వేల కోసం వెళ్తే రూ.10 లక్షల కోసం ఇరుక్కున్నామని బాధపడతారు. అయితే ఆ ఇందు ఎప్పుడు కలిసినా తమకు ఇలాంటి బాధలే వస్తున్నాయని, అది మన పాలిట యమగండం అని, రాహువు అని రాజు తిడతాడు. అప్పుడే ఆమెకు ఫోన్ చేసి తిడతాడు. నీవల్లే తమకన్నీ కష్టాలు ఎదురవుతున్నాయని అంటాడు. దీంతో ఇందు కూడా అతనిపై మండిపడుతుంది.
రేఖను డబ్బులు అడిగిన ఐశ్వర్య
ఇటు రాకేష్ కు ఇవ్వాల్సిన డబ్బు కోసం ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. నెక్లెస్ ప్లాన్ బెడసికొట్టడంతో నేరుగా రేఖను వెళ్లి డబ్బులు అడుగుతుంది. సరే ఇస్తాను కానీ కారణం ఏంటో చెప్పు అని ఆమె అడుగుతుంది. అసలు కారణం ఏంటో చెబితే తాను మరింత లోకువ అయిపోతానని ఐశ్యర్య చెప్పలేకపోతుంది. రేఖ డబ్బు ఇవ్వనని అంటుంది. మరోసారి ఆమె తండ్రి రాహుల్ తో పోలుస్తూ తిడుతుంది. దీంతో ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది.
కృష్ణయ్యకు మొరపెట్టుకున్న ఇందు
ధర్మయుద్ధం చేస్తున్నా తనకు సాయం చేసే వాళ్లు లేరని కృష్ణయ్యతో మొర పెట్టుకుంటుంది ఇందు. సంతకం పెట్టొద్దని నాన్నమ్మ అంటుంది.. పెట్టకపోతే వాళ్ల ప్రాణాలు పోతాయి.. ఏం చేయాలి.. నన్ను బతికించింది ఇలా ఓడిపోతూ తలదించుకోవడానికా.. ఈ యుద్ధంలో నాకు సాయం చేయు అని వేడుకుంటుంది.
అటు డబ్బు కోసం సాహు.. రాజు తమ్ముడు వెంకీకి యాక్సిడెంట్ చేయిస్తాడు. తర్వాత రాజును బెదిరిస్తాడు. ఈసారి మీ అమ్మానాన్నలపైకి బుల్డోజర్ వస్తుందని అంటాడు. దీంతో ఆ రూ.10 లక్షల కోసం ఐశ్వర్య ఇచ్చిన ఆఫర్ ను రాజు తీసుకుంటాడు. ఎవరిని కిడ్నాప్ చేయాలని అడిగితే.. ఇందు ఫొటో చూపిస్తుంది ఐశ్వర్య. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న ఇందుకు పరోక్షంగా ఐశ్వర్య, రాజు ఇలా సాయం చేయబోతున్నట్లుగా ఓ ట్విస్ట్ ఎదురైంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.