...
...
Next Story

జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి జాన్వీతో ఒక సినిమా చేస్తాను అని నవ్వుతూ చెప్పారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన కుబేర సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published on: Jun 23, 2025, 13:30:40 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

సౌందర్య గుర్తుకొచ్చింది

జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

"కుబేర సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్‌గా పర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్‌గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది" అని చిరంజీవి అన్నారు.

"కుబేర సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది మూవీలో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్‌ని ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్‌గా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు" అని చిరు తెలిపారు.

నేషనల్ అవార్డుకు అర్థమే లేదు

"ఈ సినిమాతో తనకి (ధనుష్) బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనే దానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం" అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

"నిర్మాత సునీల్ గారి నాన్న గారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్‌లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్ లో జాన్వీ (నిర్మాత జాహ్నవి నారంగ్) ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వీతో ఒక సినిమా చేస్తాను (నవ్వుతూ). వారు కుబేర లాంటి మరెన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అని చిరు చెప్పారు.

యంగ్‌స్టర్స్ రావాలి

"దేవి శ్రీ ప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కమ్ బ్యాక్‌లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్‌గా ఉంది. దేవి శ్రీ రికార్డింగ్‌లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను" అని చిరంజీవి తెలిపారు.

గగనం అయిపోతున్నాయి

"ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్‌కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది. ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది" అని చిరంజీవి పేర్కొన్నారు.

"కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్‌ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్" అని తన స్పీచ్ ముగించారు చిరంజీవి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe