Chiranjeevi: తెలంగాణ ఎప్‌సెట్ టాపర్‌కు చిరంజీవి అండ.. ల్యాప్‌టాప్ గిఫ్ట్‌గా ఇచ్చి సాయం చేస్తానని హామీ ఇచ్చి..

Chiranjeevi: హైదరాబాద్‌కు చెందిన రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఎం. రుషి 'టీజీ ఎప్‌సెట్ 2026' (TG EAPCET 2026) ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయానికి ముగ్ధుడైన మెగాస్టార్ చిరంజీవి.. రుషి కుటుంబ సభ్యులను తన నివాసానికి పిలిపించి అభినందించారు.

Published on: May 20, 2026, 17:17:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ 'కింగ్ సైజ్' హృదయం ఉందని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET 2026) ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి.. ఈ పరీక్ష చరిత్రలోనే టాపర్‌గా నిలిచిన మొట్టమొదటి అమ్మాయిగా రికార్డు సృష్టించిన ఎం. రుషిని చిరంజీవి స్వయంగా అభినందించారు. హైదరాబాద్‌లోని రెజోనెన్స్ జూనియర్ కాలేజీలో చదివిన రుషి చూపిన ప్రతిభను, పట్టుదలను మెగాస్టార్ కొనియాడారు. ఆమె భవిష్యత్తు ఆశయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi: తెలంగాణ ఎప్‌సెట్ టాపర్‌కు చిరంజీవి అండ.. ల్యాప్‌టాప్ గిఫ్ట్‌గా ఇచ్చి సాయం చేస్తానని హామీ ఇచ్చి..
Chiranjeevi: తెలంగాణ ఎప్‌సెట్ టాపర్‌కు చిరంజీవి అండ.. ల్యాప్‌టాప్ గిఫ్ట్‌గా ఇచ్చి సాయం చేస్తానని హామీ ఇచ్చి..

నెరవేరిన కల.. చిరు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్

నిజానికి మెగాస్టార్ చిరంజీవిని కలవడం రుషికి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పెద్ద కల. "ఎప్‌సెట్ లో కనుక స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే.. చిరంజీవి గారిని కలుద్దాం" అని రుషి తల్లిదండ్రులు ఆమెకు గతంలో ఒక ప్రామిస్ చేశారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం, తన కలను నిజం చేసుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివిన రుషి.. ఏకంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. రుషిని, ఆమె కుటుంబ సభ్యులను తన నివాసానికి ఆహ్వానించారు. వారితో ముచ్చటిస్తూ రుషి సాధించిన అసాధారణ విజయానికి గుర్తుగా ఒక ఆధునిక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.

“నన్ను మీ ఇంట్లో పెద్దన్నగా భావించండి”

భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆపై సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ (IAS) ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమని రుషి చిరంజీవికి వివరించింది. ఆమె ఆశయాలను విన్న మెగాస్టార్ ఎంతో సంతోషించారు. ఆమె ఉన్నత చదువులకు, ఐఏఎస్ కల నిజం కావడానికి తన వంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.

"భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా సంకోచించకుండా నన్ను సంప్రదించండి. నన్ను మీ కుటుంబంలో ఒక అన్నగా, ఇంటి పెద్దగా భావించండి. ఈ అమ్మాయి తన కలలను నిజం చేసుకునేలా మరింత ప్రోత్సహించండి" అని రుషి తల్లిదండ్రులకు చిరంజీవి ధైర్యం చెప్పారు.

రెజోనెన్స్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ హర్షం

ఈ సందర్భంగా రెజోనెన్స్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ (MD) పూర్ణచంద్రరావు నర్ర మాట్లాడుతూ.. "ఎం. రుషి సాధించిన ఈ విజయం కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు.. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ముఖ్యంగా రాబోయే తరం విద్యార్థినులకు ఇదొక గొప్ప ప్రేరణ. మా విద్యార్థినిని మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా పిలిచి, అభినందించి, ప్రోత్సహించడం మా రెజోనెన్స్ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపకులకు ఎంతో గర్వకారణం" అని పేర్కొన్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. TG EAPCET 2026 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఎవరు? హైదరాబాద్‌కు చెందిన రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఎం. రుషి స్టేట్ 1st ర్యాంక్ సాధించారు.

2. రుషి సాధించిన రికార్డు ప్రత్యేకత ఏమిటి?

ఎంసెట్/ఎప్‌సెట్ సుదీర్ఘ చరిత్రలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ (ఇంజనీరింగ్ విభాగంలో) సాధించిన మొట్టమొదటి అమ్మాయిగా ఎం. రుషి సరికొత్త రికార్డు సృష్టించింది.

3. చిరంజీవి టాపర్ రుషికి ఎలాంటి బహుమతి ఇచ్చారు?

రుషి ప్రతిభను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇచ్చారు. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనే ఆమె కలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

4. ఎం. రుషి భవిష్యత్తు లక్ష్యం ఏమిటి?

ఆమె మొదట ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐఏఎస్ (IAS) ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More