Chiranjeevi Peddi : చిరు లీక్స్.. పెద్ది ట్రైలర్ చూసి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Peddi : రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి, తన ఉత్సాహాన్ని ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ ఫుల్ డైలాగ్‌ను లీక్ చేశారు. జూన్ 4న ఈ చిత్రం విడుదల కానుంది

Published on: May 16, 2026, 16:34:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi Peddi: మెగాస్టార్ చిరంజీవికి ఒక అలవాటు ఉంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాలైనా లేదా తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రాల అప్‌డేట్స్ అయినా.. ఆ ఉత్సాహంలో కొన్ని కీలక విషయాలను ముందే బయటపెట్టేస్తుంటారు. అభిమానులు దీనిని ఎంతో ప్రేమగా "చిరు లీక్స్" అని పిలుచుకుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ట్రైలర్ చూసిన మెగాస్టార్, ఆ ఆనందంలో సినిమాలోని ఒక పవర్ ఫుల్ డైలాగ్‌ను లీక్ చేసి సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి తెరలేపారు.

రామ్ చరణ్, చిరంజీవి
రామ్ చరణ్, చిరంజీవి

పెద్ది ట్రైలర్…

​ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ అధికారిక విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ మూడు నిమిషాల ట్రైలర్‌ను వీక్షించారు. ట్రైలర్ చూసిన తర్వాత కలిగిన ఉద్వేగాన్ని ఆపుకోలేక ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

రఫ్ఫాడించేశారు..

​"పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్! 3 నిమిషాల ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ఫాడించేశారు. మీరు ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ ఆ అంచనాలను మించి ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్.. అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి," అంటూ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.

డైలాగ్ లీక్…

​అయితే అంతటితో ఆగకుండా, ఆ ఎగ్జైట్‌మెంట్‌లో ట్రైలర్‌లోని ఒక సెన్సేషనల్ డైలాగ్‌ను కూడా అలవాటు ప్రకారం లీక్ చేశారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సర్" అనే డైలాగ్‌ను చిరంజీవి ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆట మాత్రమే అనుకున్న చోట చరణ్ పెద్ద యుద్ధమే చేశాడనే అర్థం వచ్చేలా ఉన్న ఈ డైలాగ్, సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. ఈ మెగా సర్ప్రైజ్ లైన్‌ను ముందే లీక్ చేసినందుకు చిరంజీవి సరదాగా క్షమాపణలు కూడా చెప్పారు.

పెద్ది రిలీజ్…

పెద్ది​ చిత్రంలో రామ్ చరణ్ ఒక రెజ్లర్ (పహిల్వాన్) పాత్రలో ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ముందు జూన్ 3న ప్రీమియర్ షోలు పడనున్నాయి.

​తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

జవాబు: 'పెద్ది' చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఒకరోజు ముందే అంటే జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు.

​ప్రశ్న: 'పెద్ది' సినిమా ట్రైలర్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?

జవాబు: ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న ముంబైలో జరిగే ఒక భారీ ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు.

​ప్రశ్న: చిరంజీవి లీక్ చేసిన 'పెద్ది' డైలాగ్ ఏమిటి?

జవాబు: "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సర్" అనే పవర్ ఫుల్ డైలాగ్‌ను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు.

​ప్రశ్న: ఈ చిత్రానికి దర్శకుడు, సంగీత దర్శకుడు ఎవరు?

జవాబు: 'పెద్ది' చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More