ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ..

ప్రముఖ స్టాండప్ కమెడియన్, రియాలిటీ షో స్టార్ మునావర్ ఫరూఖీ మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై చేసిన ఒక వివాదాస్పద పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇరాన్‌కు మద్దతుగా అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Published on: Mar 03, 2026 1:51 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణపై కమెడియన్ మునావర్ ఫరూఖీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా నిలబడిన ఏకైక దేశం ఇరాన్ మాత్రమేనని అతడు పరోక్షంగా పేర్కొనడం చర్చకు దారితీసింది. అతడు చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే ఇరాన్ అధ్యక్షుడు చేసిన మారణ హోమం సమయంలో లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ నిలదీస్తున్నారు.

ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ.. (PTI)
ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ.. (PTI)

మునావర్ ఫరూఖీ ఏమన్నాడంటే?

కమెడియన్ మునావర్ ఫరూఖీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ప్రపంచ దృష్టిని 'ఎప్స్టీన్ ఫైల్స్' (Epstein files) నుండి మళ్లించే ప్రయత్నమని ఆరోపించాడు. డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను ఉద్దేశిస్తూ.. "చమురు, బంగారం కోసం ఆడుతున్న ఆట ఇది. గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ఏకైక దేశంపై బాంబులు వేస్తున్నారు. ఒక బాలల వేధింపుల నిందితుడు హీరోలా నటించడం ఈ వికృత ప్రపంచానికి సంకేతం" అని ఘాటుగా రాశాడు.

నెటిజన్ల రియాక్షన్ ఇలా..

మునావర్ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "కేవలం ఒక్క దేశం మాత్రమే నిలబడిందా?" అని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు "ఇరాన్ ప్రజలే అక్కడ సంబరాలు చేసుకుంటుంటే, మీరు మాత్రం మద్దతు ఇస్తున్నారా?" అని నిలదీశారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని, బాల్య వివాహాలను సమర్థించేవారిని ఎలా సపోర్ట్ చేస్తారని మునావర్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. అయితే మునావర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక వర్గం వాళ్లు అతనికి మద్దతుగా నిలిచారు.

యుద్ధ క్షేత్రంలో తాజా పరిస్థితి

ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అక్కడ అధికారం ఎవరి చేతుల్లో ఉందో స్పష్టత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇరాన్ చర్యలకు తగిన ప్రతిఘటన ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.