OTT Crime Thriller: మలయాళ నటి క్రైమ్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలోకి.. ఫ్రెండ్ హత్య కేసు ఛేదించే పోలీస్.. ట్రైలర్ రిలీజ్

OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. మలయాళ నటి నిమిషా సజయన్ నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆగస్ట్ 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Published on: Aug 21, 2026, 14:27:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Crime Thriller: మలయాళ విలక్షణ నటి నిమిషా సజయన్ మెయిన్ లీడ్‌గా నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'బబితా సింగ్ రిపోర్టింగ్' (Babita Singh Reporting) అఫీషియల్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. యంగ్ పోలీస్ ఆఫీసర్ అవతార్‌లో నిమిషా నటన, కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే సస్పెన్స్ ఎలిమెంట్స్ డిజిటల్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.

OTT Crime Thriller: మలయాళ నటి క్రైమ్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలోకి.. ఫ్రెండ్ హత్య కేసు ఛేదించే పోలీస్.. ట్రైలర్ రిలీజ్
OTT Crime Thriller: మలయాళ నటి క్రైమ్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలోకి.. ఫ్రెండ్ హత్య కేసు ఛేదించే పోలీస్.. ట్రైలర్ రిలీజ్

చిన్ననాటి ఫ్రెండ్ మర్డర్.. పర్సనల్‌గా మారిన ఇన్వెస్టిగేషన్

క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఇందులో నిమిషా సజయన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ బబితా సింగ్ (అందరూ ప్రేమగా 'బేబీ' అని పిలుస్తారు) పాత్రలో కనిపించారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు బన్సీ (బరుణ్ సోబ్టి) దారుణ హత్యకు గురవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

తన ప్రాణస్నేహితుడిని చంపిన హంతకుడిని పట్టుకోవడానికి బేబీ దర్యాప్తు ప్రారంభించగా, అనేక రహస్యాలు బయటపడతాయి. మామూలు మర్డర్ మిస్టరీగా మొదలైన ఈ కేస్, చివరకు ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రమాదకరంగా మారుతుంది. తను నమ్మిన సొంత మనుషుల నిజస్వరూపాలు బయటపడటంతో ఆమె ఏ నిర్ణయం తీసుకుందనేది ఈ థ్రిల్లర్ మెయిన్ పాయింట్.

నిమిషా సజయన్, బరుణ్ సోబ్టి మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్

సౌత్ అండ్ నార్త్ ప్రాజెక్ట్‌లలో ఇంటెన్స్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న నిమిషా సజయన్.. బబితా క్యారెక్టర్‌లో జీవించేశారు. పోలీస్ డ్యూటీకి, ఫ్రెండ్‌ను కోల్పోయిన పర్సనల్ ఎమోషన్‌కు మధ్య నలిగిపోయే ఆఫీసర్‌గా ఆమె పండించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.

ఇక టీవీ, ఓటీటీ వరల్డ్‌లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న బరుణ్ సోబ్టి, అన్షుమాన్ పుష్కర్ కీలక పాత్రల్లో కనిపించి కథకు మరింత బలాన్నిచ్చారు. 'పాతాళ్ లోక్', 'కోహ్రా' లాంటి కల్ట్ ఓటీటీ సిరీస్‌లను అందించిన ప్రసిద్ధ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుదీప్ శర్మ ఈ ప్రాజెక్ట్‌కి నేతృత్వం వహించడం విశేషం.

మర్డర్ మిస్టరీ దాటిన ఎమోషనల్ డెప్త్

కేవలం హంతకుడు ఎవరనేది చూపించడమే కాకుండా, నిజం బయటపడినప్పుడు అనుబంధాల్లో వచ్చే ఎమోషనల్ పరిణామాలను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించినట్లు డైరెక్టర్ అంబికా పండిట్ తెలిపారు. సమాజంలో మహిళలు తమ భావోద్వేగాలను అణచుకుంటూ ఎలా రాజీ పడాల్సి వస్తుందో ఈ మూవీ టచ్ చేస్తుందని ఆమె వివరించారు.

నిమిషా సజయన్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే బబితా క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక కూడా ఈ పాత్ర తన మనసులో ఉండిపోయిందని, ప్రతీ ఒక్కరూ తమ జీవితాల్లో ఎంతలా రాజీపడతారో ఆలోచించేలా చేస్తుందని చెప్పారు.

ప్రైమ్ వీడియోలో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్

ఫిల్మ్ స్క్వాడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆక్ట్ త్రీ భాగస్వామ్యంతో సౌరభ్ మల్హోత్రా, మనుజ్ మిత్రా, టీనా థర్వాణి ఈ విభిన్న చిత్రాన్ని నిర్మించారు. అమిత వ్యాస్ రాసిన కథను డైరెక్టర్ అంబికా పండిట్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో రూపొందించారు.

ఈ మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆగస్టు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ డిజిటల్ ట్రీట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More