OTT Crime Thriller: అడవిలో రక్తపాతం.. స్టార్ హీరో సూపర్ విలనిజం.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

OTT Crime Thriller: ఓటీటీలోకి రక్తపాతం పారించే మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అర్షద్ వార్సీ విలనిజంతో భయపెడుతున్న ఘమాసాన్ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Aug 27, 2026, 14:22:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Crime Thriller: బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘమాసాన్' (Ghamasaan) అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ పవర్‌ఫుల్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంటెన్స్ డ్రామా జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

OTT Crime Thriller: అడవిలో రక్తపాతం.. స్టార్ హీరో సూపర్ విలనిజం.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
OTT Crime Thriller: అడవిలో రక్తపాతం.. స్టార్ హీరో సూపర్ విలనిజం.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

బుందేల్‌ఖండ్ బ్యాక్‌డ్రాప్‌లో పోలీస్ vs దొంగల ఫైట్

హిందీ హార్ట్‌ల్యాండ్ అయిన బుందేల్‌ఖండ్ లోయల నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ సాగుతుంది. చట్టం, నేరం మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోయిన చోట ఒక పోలీస్ ఆఫీసర్, తిరుగుబాటుదారుడైన నేరస్థుడి మధ్య జరిగే ప్రాణాంతకమైన పోరాటమే ఈ 'ఘమాసాన్'. తెలుగులో ఘమాసాన్ అంటే పెనుగులాట అని అర్థం.

'స్కామ్ 1992' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో ఆదిత్య అనే నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. మరోవైపు 'అసుర్', 'మున్నాభాయ్' చిత్రాల ఫేమ్ అర్షద్ వార్సీ 'మహారాజ్' అనే దారుణమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.

అర్షద్ వార్సీ మైండ్ బ్లాకింగ్ విలనిజం

ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ, పాజిటివ్ రోల్స్‌లో అలరించిన అర్షద్ వార్సీ ఈ సినిమాలో పూర్తిగా డార్క్ అండ్ రా లుక్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లో ఇంత డార్క్, అసలు ఊహకందని బాడీ లాంగ్వేజ్ ట్రై చేయడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు.

మరోవైపు ప్రతీక్ గాంధీ కూడా చట్టాన్ని కాపాడటానికి వ్యవస్థతో పోరాడే ఆఫీసర్‌గా చాలా ఇంటెన్స్‌గా అలరించారు. కేవలం ఒక పోలీస్ - విలన్ గొడవలా కాకుండా, ఆధిపత్యం, రాజకీయాలు, మనుగడ కోసం జరిగే వేటగా దర్శకుడు దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఇషితా దత్తా కూడా ఒక కీలకమైన రోల్ చేశారు.

దిగ్గజ దర్శకుడి మార్క్.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ హడావుడి

'పాన్ సింగ్ తోమర్', 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్' లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలను తెరకెక్కించిన తిగ్మాన్షు ధులియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రా అండ్ రియలిస్టిక్ టేకింగ్‌కు పేరుగాంచిన తిగ్మాన్షు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

ఓటీటీ రిలీజ్‌కు ముందే ఈ సినిమా అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. మామి (MAMI) ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, సినెవెస్చర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా.. విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.

సెప్టెంబర్ 11న జీ5లో ధమాకా

జియో స్టూడియోస్ నిర్మించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మంచి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ సెప్టెంబర్ 11న జీ5లో రాబోతున్న 'ఘమాసాన్' పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది. డిఫరెంట్ కంటెంట్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More