Disha Patani Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో అంబానీ ఫ్యామిలీ గ్రాండ్గా నిర్వహించిన గణేష్ చతుర్థి 2026 వేడుకల్లో ఆమె వేసుకున్న బోల్డ్ అవుట్ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వినాయక దర్శనం కోసం లో-కట్ బ్లౌజ్, రెడ్ లెహంగాలో వచ్చిన దిషాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అంబానీ వేడుకల్లో బోల్డ్ డ్రెస్.. ఫొటోలు వైరల్

వినాయక చవితి పండగ సందర్భంగా ముంబైలోని అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు దిశా పటానీ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ ఘాగ్రా, డీప్-కట్ బ్లౌజ్ వేసుకొని వచ్చారు.
ఒంటిపై ఎర్రటి దుపట్టాతో పాటు హెవీ ఇయర్ రింగ్స్, గాజులతో మెరిసిపోతూ మీడియా కెమెరాలకు పోజులిచ్చారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేవుడి పూజకు వచ్చేటప్పుడు పద్ధతిగా దుస్తులు వేసుకోవాలనే కనీస జ్ఞానం లేదా అంటూ ఎక్స్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
"ఫ్యాషన్ షో కాదిది!".. నెటిజన్ల ఫైర్
దిశా పటానీ లుక్పై సోషల్ మీడియాలో కామెంట్ల తుఫాన్ నడుస్తోంది. "గణపతి పూజకు ఇలాంటి అసభ్యకరమైన దుస్తులేంటి? పూజా వేదికలకు కచ్చితంగా డ్రెస్ కోడ్ పెట్టాలి" అని ఒక నెటిజన్ ఘాటుగా స్పందించారు.
"ఇది వినాయక దర్శనం, భక్తితో దండం పెట్టుకోవడానికి వచ్చారా లేక ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చారా?" అని మరొకరు ప్రశ్నించారు. హిందువుల సంస్కృతి, పండగల పవిత్రతను బాలీవుడ్ భామలు బొత్తిగా పట్టించుకోవడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇలాంటి హీరోయిన్లకు అసలు టాలెంట్ ఉండదని, అందుకే ఎక్కడికెళ్లిన ఇలాంటి బట్టలు వేసుకొని లైమ్ లైట్ లో ఉండటానికి చూస్తారని మరో యూజర్ ఘాటుగా విమర్శించడం గమనార్హం.
కృతి సనన్ వివాదం గుర్తుచేసిన నెటిజన్లు
{{/usCountry}}ఇలాంటి హీరోయిన్లకు అసలు టాలెంట్ ఉండదని, అందుకే ఎక్కడికెళ్లిన ఇలాంటి బట్టలు వేసుకొని లైమ్ లైట్ లో ఉండటానికి చూస్తారని మరో యూజర్ ఘాటుగా విమర్శించడం గమనార్హం.
కృతి సనన్ వివాదం గుర్తుచేసిన నెటిజన్లు
{{/usCountry}}ఇటీవలే ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గివా' (GIVA) రాఖీ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ వేసుకున్న బ్రాలెట్ బ్లౌజ్ కూడా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ యాడ్పై తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో కంపెనీ దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఆ వివాదం ముగియక ముందే ఇప్పుడు దిశా పటానీ రూపంలో మరో వివాదం బయటకు వచ్చింది. "మొన్న కృతి సనన్, నిన్న దిశా పటానీ.. హిందూ పండగల సమయంలోనే వీళ్లకు ఇలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుందా?" అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు.
సాంప్రదాయాన్ని గౌరవించండి
మహిళల దుస్తుల స్వేచ్ఛను ఎవరూ కాదనడం లేదని, అయితే సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. నైట్క్లబ్లు, పార్టీలు, డ్యాన్స్ ఫ్లోర్లకు వేసుకునే బట్టలను దేవుడి పూజలకు వేసుకురావడం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే మరేంటని నిలదీస్తున్నారు.
కాగా దిశా పటానీ ఇటీవల ఇమ్రాన్ హష్మీ సరసన 'ఆవారాపన్ 2' సినిమాలో కనిపించారు. అలాగే కృతి సనన్ షాహిద్ కపూర్, రష్మిక మందన్నతో కలసి 'కాక్టెయిల్ 2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ డ్రెస్ కోడ్ వివాదంపై దిశా పటానీ ఇంకా స్పందించాల్సి ఉంది.