గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నాట్యం చేస్తూ ప్రభావతికి పట్టిన మెడ- మంత్రసానితో వైద్యం- మనోజ్ షాప్కి మాణిక్యం
గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 14 ఎపిసోడ్లో ప్రభావతి దగ్గర శిష్యులుగా మీనా, బాలు చేరుతారు. మీనాతో పోటీ పడి డ్యాన్స్ చేసిన ప్రభావతికి మెడ పట్టేసుకుంటుంది. దాంతో మంత్రసానిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తే అది వికటిస్తుంది. రోడ్డు మీద రోహిణి మావయ్య మాణిక్యంను మీనా చూడటంతో మనోజ్ షాప్కు వెళ్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఈ ఊరివాళ్లను నమ్ముకుని డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నందుకు నాది బుద్ధి తక్కువ అని ప్రభావతి వెళ్లిపోతుంటే.. కనీసం టిఫిన్ అయిన తినండి అని మీనా అంటుంది. ఏమొద్దు. నువ్వే నూనే పోసి వత్తి పెట్టావ్గా ఇలా జరగాల్సిందే అని ప్రభావతి వెళ్లిపోతుంది. కోపంలో అన్నది ఫీల్ అవ్వకు అని సత్యం వెళ్తాడు.

కామాక్షి సెటైర్లు
ఈ విషయం మనం ఏం చేయగలం అని మీనా అంటుంది.. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక రాయి వేసి చూద్దాం అని బాలు అంటాడు. మరుసటి రోజు ఉదయం ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో ఈగలు తోలుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి సెటైర్లు వేస్తుంది. నేను చీటి పాడేవారికి చెప్పాను. వారిని ముగ్గురికి చెప్పమని చెప్పాను. పొద్దున ఒక బ్యాచ్, రాత్రి ఒక బ్యాచ్ను పిలవొచ్చు అని కామాక్షి అంటుంది.
ఇంతలో మీనా, బాలు తాంబూలం తీసుకుని వస్తారు. వీళ్లను పంపించేయ్. నన్ను ఎగతాళి చేయడానికే వచ్చారు అని ప్రభావతి అరుస్తుంది. గురువు గారు మేము నిజంగానే నాట్యం నేర్చుకుందామని వచ్చాం. శిశ్యులు లేరని మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. అందుకే మీకు శిష్యులుగా వచ్చామని మీనా అంటుంది. ప్రభావతి ఏదోటి అనబోతుంటే.. ఆగు వదినా నీ బాధ చూడలేక నీ కొడుకు కోడలు నీకు శిశ్యులుగా వచ్చారు. నువ్వు తీసుకునే ఫీజు రెండు వేలు తీసుకొచ్చారు. ఇది శుభ శకునంలా ఉందని కామాక్షి అంటుంది.
ప్రభావతికి పట్టేసుకున్న మెడ
డ్యాన్స్ అంటే పూలు కట్టడం కాదని ప్రభావతి అంటుంది. అలా కాదు గురువావతి అని బాలు అంటాడు. అలా అనొద్దు గురువు గారే అనాలి. మీరు కూడా నేర్చుకొనేటప్పుడు ఏం రాదుగా అని మీనా అంటుంది. రెండో రోజే దుకాణం కట్టేయాల్సి వస్తుంది నీ ఇష్టం అని కామాక్షి అంటుంది. దాంతో ప్రభావతి ఒప్పుకుంటుంది. నటరాజ స్వామికి ప్రార్థన చేయమని చూపిస్తుంది ప్రభావతి.
బాలు వింతగా చేస్తూ నవ్విస్తాడు. దీన్ని భరత నాట్యం అంటారా అని ప్రభావతి చిరాకుపడుతుంది. భర్త నాట్యం అంటారా బాలు అంటాడు. మీరు నేర్పించండి ముందు అని మీనా అంటుంది. రేయ్ నువ్వు పక్కకు వెళ్లు. నువ్వు రావే అని మీనాను చేయమంటుంది ప్రభావతి. మీనా భరత నాట్యం చేస్తుంది. తర్వాత ప్రభావతి చేస్తుంది. కన్నులతో చూసేది అనే పాటకు అత్తాకోడలు ఇద్దరు పోటీ పడి మరి భరతనాట్యం చేస్తారు.
ప్రభావతి చేస్తూ చేస్తూ చివరికి మెడ పట్టేసుకుంటుంది. మెడ తిప్పలేను అంటూ ప్రభావతి నొప్పితో కేకలు పెడుతుంది. ఇన్నాళ్లు పని చెప్పకుండా చేశావ్. నరాలు ఎక్కడెక్కడి పట్టేశాయి. ఇలా జరిగినప్పుడు నూనేతో మర్దన చేస్తారు. ఆవిడకు కాల్ చేసి నేను రమ్మంటాను. మీరు వెళ్లండి అని కామాక్షి చెబుతుంది. దాంతో ప్రభావతిను కారులో తీసుకొస్తారు.
మంత్రసానితో వైద్యం
కుడి చేయి చాచుకుని ఉండటంతో పరువు పోతుందని ప్రభావతి అంటుంది. దాంతో రెండు దుప్పట్లతో ప్రభావతి కనిపించకుండా కవర్ చేస్తూ ఇంట్లోకి తీసుకెళ్తారు బాలు, మీనా. సత్యం చూసి ఏమైందిరా అని అడుగుతారు. శిల్పంలా మారిపోయారని బాలు అంటే.. డ్యాన్స్ చేస్తుంటే మెడ పట్టేసిందని మీనా చెబుతుంది. అహంకారం ఎలాంటి శిక్ష వేస్తుందో చూశావా అని సత్యం అంటాడు.
ఇంతలో మంత్రసానిని కామాక్షి తీసుకొస్తుంది. ప్రభావతిని లోపలికి తీసుకెళ్లి వైద్యం చేస్తుంది మంత్రసాని. ప్రభావతి నొప్పితో అరుస్తుంటుంది. కాసేపటికి అంతా కిందకు వస్తారు. ప్రభావతి కూడా కిందకు వస్తుంది. అయితే, అప్పటివరకు కుడివైపు ఉన్న ప్రభావతి మెడ ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. వైద్యం వికటిస్తుంది. రేపు వచ్చి మళ్లీ వైద్యం చేస్తానని మంత్రసాని వెళ్లిపోతుంది.
మీనా నువ్ కావాలనే వచ్చి చేరావుగా. నీ వల్లే నా మెడ పట్టేసిందని ప్రభావతి అంటుంది. దాంతో ప్రభావతిని సత్యం, శ్రుతి తప్పుబడతారు. బాలు, మీనా ఇద్దరు దీని గురించి మాట్లాడుకుంటారు. నువ్ డ్యాన్స్ మధ్యలో ఆపాల్సింది. మెడ పట్టేసేవరకు ఎందుకు చేశావ్. అది నా ప్లాన్లో లేదని బాలు అంటాడు. మీరు కూడా మీ అమ్మనే వెనుకేసుకురండి అని మీనా అలుగుతుంది.
మనోజ్ షాప్కు మాణిక్యం
తర్వాత మనోజ్ షాప్కు రోహిణి మలేషియా మావయ్యగా నాటకం ఆడిన మటన్ కొట్టు మాణిక్యం పరుగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడికెందుకు వచ్చావని రోహిణి అడిగితే.. మీనా చూసేసింది. ఇక్కడికే వస్తుందని మాణిక్యం చెబుతాడు. ఇంతలో మీనా వస్తుంది. అప్పుడే రాజేష్కు బీరువా కోసం బాలు వస్తాడు.
మనోజ్ చూపించిన బీరువాలోనే మాణిక్యం దాక్కుని ఉంటాడు. అందులోనే మాణిక్యం ఉన్నాడని రోహిణికి విద్య చెబుతుంది. దాంతో రోహిణి షాక్ అయి వెళ్లి బీరువా పట్టుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


