కొండగట్టు అంజన్న దర్శనం ఎంతో భాగ్యం - హీరో అర్జున్
సినీ హీరో అర్జున్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
సినీ హీరో అర్జున్ సర్జా తన కుటుంబంతో కలిసి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సోమవారం కొండగట్టు దేవాలయానికి చేరుకున్న అర్జున్,,, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హీరో అర్జున్
ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు అర్జున్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తాను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. స్వామివారి శేషవస్త్రంతో అర్జున్ను సత్కరించి ప్రసాదం అందజేశారు.
అదృష్టంగా భావిస్తున్నాం - హీరో అర్జున్
దర్శనం తర్వాత హీరో అర్జున్ మాట్లాడుతూ….. ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయ స్వామి దర్శనం తనకు ఎంతో విశేషమన్నారు. “కొండగట్టు టెంపుల్ గురించి ఎంతో విన్నాను. ఎంతో శక్తిమంతుడని తెలుసుకున్నాను. మొదటిసారిగా ఈ కొండగట్టుకు వచ్చాను. ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలని చాలాకాలంగా అనుకుటుంటున్నా. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికి మంచి జరగాలి”అని తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు అర్జున్ స్వయంగా అరటిపండ్లను అందించి భక్తిని చాటుకున్నారు. భక్తులు అర్జున్ కలిసేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫొటోలు దిగారు.
తన కూతురు ఐశ్వర్య సర్జా నటించిన 'సీతాపయణం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అర్జున్ జగిత్యాలకు వచ్చారు. పూజల తరువాత జగిత్యాలలోని శ్రీనివాస థియేటర్కు వెళ్లి ప్రేక్షకులను… అభిమానులను కలిశారు. ఐశ్వర్య సర్జా నటించిన 'సీతా పయణం' ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసిందే.
అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ను తెరకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ కూడా నిర్వహించారు. ఇందులో హీరో అర్జున్ మాట్లాడుతూ… ‘‘సీతా పయనం’ మూవీకి మంచి స్పందన వస్తోందన్నారు.