అత్యధిక వసూళ్ల మలయాళం మూవీ.. ఈరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఇక్కడ చూసేయండి
మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ సాధించిన తొలి సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. తెలుగులో కొత్తలోక పేరుతో రిలీజైన ఈ సినిమా ఆదివారం (జనవరి 11) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చి చరిత్ర సృష్టించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాను స్టార్ మా ప్రీమియర్ చేయబోతోంది. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

కొత్త లోక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో వచ్చింది. ఈ సినిమాను ఆదివారం (జనవరి 11) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ప్రీమియర్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఒక లోకం. ఒక పోరాటం. అంతులేని పరీక్షలు.. ది రైజ్ ఆఫ్ చంద్ర రేపే ప్రారంభమవుతోంది. కొత్త లోక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
కొత్త లోక మూవీ విశేషాలు
మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చిన ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఈ లోకా ఛాప్టర్ 1: చంద్ర. ఇప్పటికే ఈ మూవీ జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది అక్టోబర్ 31నే స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడు స్టార్ మాలోకి రాబోతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ఈ సినిమా గతేడాది ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ అయింది.
మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా ఈ లోకా ఛాప్టర్ 1: చంద్ర నిలిచింది. ఈ క్రమంలో మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ రికార్డును బ్రేక్ చేసింది. నిజానికి ఈ సినిమా స్ట్రీమింగ్ జియోహాట్స్టార్ లోనే అని చాలా రోజుల కిందటే తేలిపోయినా.. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల మార్క్ దాటేంత వరకు స్ట్రీమింగ్ తేదీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లు, ఓటీటీలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు టీవీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


