ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్దీప్ రాజన్ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మే నెలలో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు, కుడి చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు చేసిన తర్వాత కోలుకున్న పవన్దీప్.. తాజాగా సలీం-సులేమాన్ పాడ్కాస్ట్లో పాల్గొని ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ కష్టకాలాన్ని ఒక పాఠంగా ఎలా మలుచుకున్నాడో వివరించాడు.
కారులో మంటలు, సాయం కోసం ఎదురుచూపులు

ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ పవన్దీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. “మొదట్లో మాకు ఎవరూ సహాయం చేయలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే కారులో మంటలు చెలరేగాయి. నేను ఆ మంటల్లో చిక్కుకున్న కారు లోపలే ఉన్నాను. వాళ్ళలో ఒకరు నన్ను బయటకు లాగారు” అని పవన్దీప్ చెప్పాడు.
"నేను ఎంతసేపు లోపల ఉన్నానో నాకు తెలియదు. కానీ కళ్ళు తెరిచేసరికి కారు బయట ఉన్నాను. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా రెండు కాళ్లు, ఒక చెయ్యి విరిగిపోయాయి. వెంటనే ఇంటికి ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులను రమ్మని చెప్పాను. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలనే ఆలోచన మాత్రమే అప్పుడు నాలో ఉంది. ఇప్పుడు అంతా కుదుటపడింది" అని పవన్దీప్ తెలిపాడు.
ఆ విలువ ఇప్పుడే తెలిసింది..
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని పవన్దీప్ చెప్పాడు. “మొదటి నెలలో కనీసం పక్కకు కదలడానికి కూడా నాకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు కొంచెం నడవగలుగుతున్నాను. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నడవగలగడం అనేది ఎంత గొప్ప వరమో ఈ అనుభవం నాకు నేర్పింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని అంగీకరించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి” అని అతడు అన్నాడు.
"నెమ్మదిగా నడవడం ప్రారంభించాను. వచ్చే నెలలో నా కదలికలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నాను. ప్రమాదం తర్వాత మంచానికే పరిమితమయ్యాను. చికిత్స కోసం గాయపడిన కాలుతో ముంబై వెళ్లినప్పుడు కూడా మరో నెల రోజుల పాటు కదలకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మెల్లగా నడుస్తున్నాను. మళ్లీ గిటార్ వాయించడం కూడా మొదలుపెట్టాను. నా చేతికి బలం వచ్చింది కానీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది" అని వివరించాడు.
అసలేం జరిగింది?
{{/usCountry}}"నెమ్మదిగా నడవడం ప్రారంభించాను. వచ్చే నెలలో నా కదలికలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నాను. ప్రమాదం తర్వాత మంచానికే పరిమితమయ్యాను. చికిత్స కోసం గాయపడిన కాలుతో ముంబై వెళ్లినప్పుడు కూడా మరో నెల రోజుల పాటు కదలకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మెల్లగా నడుస్తున్నాను. మళ్లీ గిటార్ వాయించడం కూడా మొదలుపెట్టాను. నా చేతికి బలం వచ్చింది కానీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది" అని వివరించాడు.
అసలేం జరిగింది?
{{/usCountry}}ఈ ఏడాది మే 5న పవన్దీప్ రాజన్ లైవ్ షో కోసం అహ్మదాబాద్ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. మొరాదాబాద్ సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతని కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మొదట దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎన్సీఆర్లోని ఆసుపత్రికి మార్చి పలు శస్త్రచికిత్సలు చేశారు.