Kangana Ranaut Baba Ramdev Fight Ends: బాలీవుడ్ హీరోయిన్, భాజపా లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్దేవ్ మధ్య గత కొద్ది రోజులుగా సాగుతున్న ఘాటైన వ్యాఖ్యల పర్వానికి తెరపడింది. 'జెన్-జీ' (Gen Z) యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారి, వీరిద్దరి మధ్య వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.
వివాదం ఎలా మొదలైందంటే?

అయితే రక్షాబంధన్ వేడుకల వేళ వీరిద్దరూ పాత వైరాన్ని మరచి వివాదానికి శుభం కార్డ్ వేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ నేటి తరం యువతను 'గట్టర్ జనరేషన్' అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై బాబా రామ్దేవ్ మండిపడ్డారు. "యువతను అలా అనడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఆమె చిన్నతనం, గతం ఎలాంటిదో అందరికీ తెలుసు" అని రామ్దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో కంగనా అంతే ఘాటుగా రీకౌంటర్ ఇచ్చారు. నా వ్యక్తిగత జీవితం, గతం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని స్పష్టం చేశారు. పతాంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో రామ్దేవ్కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
రాఖీ పండుగ వేళ రామ్దేవ్ శాంతి మంత్రం
ఇరుపక్షాల మధ్య వాతావరణం వేడెక్కడంతో బాబా రామ్దేవ్ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో ద్వేషం, శత్రుత్వానికి తావుండకూడదని, ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
'అన్నయ్య రామ్దేవ్' అంటూ కంగనా స్పందన
"ఈ రక్షాబంధన్ సందర్భంగా కంగనాకు మిఠాయిలు పంపి శుభాకాంక్షలు తెలుపుతాను. వివాదాలు కాకుండా సంభాషణలు మాత్రమే జరగాలి" అని రామ్దేవ్ విలేకరులతో పేర్కొన్నారు. రామ్దేవ్ ప్రతిపాదనపై కంగనా రనౌత్ వెంటనే సానుకూలంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రామ్దేవ్ వీడియోను షేర్ చేస్తూ ఒక ప్రత్యేక నోట్ రాసారు.
"పండుగ రోజు పాత పొరపాట్లను మర్చిపోవడమే ఉత్తమ మార్గం. వివాదం కంటే సంభాషణే మేలని నా సోదరుడు బాబా రామ్దేవ్ సరిగ్గానే చెప్పారు. రాఖీ పండుగ వేళ ఆయన పంపిన ప్రేమను, మిఠాయిలను స్వీకరిస్తున్నాను. దేవుడు ఆయనకు దీర్ఘాయుష్షు ఇవ్వాలి" అని కంగనా రాసుకొచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీసిన ఈ వివాదానికి ప్రశాంతంగా తెరపడింది.
హీరోయిన్ తాప్సీతో వివాదం
{{/usCountry}}"పండుగ రోజు పాత పొరపాట్లను మర్చిపోవడమే ఉత్తమ మార్గం. వివాదం కంటే సంభాషణే మేలని నా సోదరుడు బాబా రామ్దేవ్ సరిగ్గానే చెప్పారు. రాఖీ పండుగ వేళ ఆయన పంపిన ప్రేమను, మిఠాయిలను స్వీకరిస్తున్నాను. దేవుడు ఆయనకు దీర్ఘాయుష్షు ఇవ్వాలి" అని కంగనా రాసుకొచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీసిన ఈ వివాదానికి ప్రశాంతంగా తెరపడింది.
హీరోయిన్ తాప్సీతో వివాదం
{{/usCountry}}అయితే, కంగనా, మరో హీరోయిన్ తాప్సీ మధ్య కూడా వివాదం జోరుగానే సాగుతున్న విషయం తెలిసిందే. తనను చీప్ కాపీ అని కంగనా అనడంపై పలుమార్లు రియాక్ట్ అయిన తాప్సీ సెటైర్లు వేసింది. కంగనా పెంపకం, ప్రవర్తనపై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది తాప్సీ.
అంతే ఘాటుగా తాప్సీపై కూడా కంగనా రిప్లై ఇచ్చింది. "తల్లిదండ్రుల పెంపకం ప్రస్తావించి నువ్వేంటో నిరూపించుకున్నావ్. ప్రతిసారీ హెడ్లైన్ల కోసం నా పేరు వాడుకుంటుంది. మీ తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది. ఎందుకంటే వాళ్లు నాలాంటి అసలైన మనిషిని కాకుండా చీప్ కాపీని కన్నారేంటని" అని కంగనా రాసుకొచ్చింది.
ఏదైనా పండుగ సందర్భంగా కలిస్తే!
బాబా రామ్దేవ్, కంగనా వివాదానికి తెరపడిన నేపథ్యంలో తాప్సీతో కూడా వార్ ఎప్పుడు ముగుస్తుందని సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ అనుకుంటున్నారు. రాఖీలాగే ఏదైనా పండుగ సందర్భంగా కంగనా, తాప్సీ కలిసిపోతే ఈ హీరోయిన్ల వార్ ముగుస్తుందని ఆశిస్తున్నారు.