Kangana Ranaut: ఓ నాస్తికుడు టాపర్ కావడం ఇప్పటి వరకూ చూడలేదు: నీట్పై కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut: ఓ నాస్తికుడు టాపర్ అయినట్లు తాను ఇప్పటి వరకూ చూడలేదని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎంత కష్టపడి చదివినా దేవుడి అనుగ్రహం ఉండాల్సిందే అన్నట్లు ఆమె మాట్లాడటం గమనార్హం.
Kangana Ranaut: నీట్ యూజీ (NEET UG) 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ స్టూడెంట్ వైష్ణవి దాస్ ఇంటర్వ్యూపై బాలీవుడ్ యాక్టర్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

వైష్ణవి దాస్ 720 మార్కులకు గానూ 700 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 20వ ర్యాంక్ సొంతం చేసుకుంది. తన రిజల్ట్ వచ్చిన క్షణంలో తల్లిదండ్రులతో కలిసి పూరీ జగన్నాథుడి రథయాత్ర వేడుకలకు వెళ్తున్నట్లు వైష్ణవి ఏఎన్ఐ (ANI) ఇంటర్వ్యూలో చెప్పింది. గుడి దాటిన వెంటనే ర్యాంక్ 20 అని వార్త వినడంతో కారు రోడ్డు పక్కన ఆపి కన్నీళ్లు పెట్టుకున్నామని ఆమె వెల్లడించింది.
"నాస్తికుడైన విజేతను నేను చూడలేదు"
వైష్ణవి ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన కంగనా, దేవుడిపై నమ్మకం, కష్టపడే తత్వం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. "నేను నా లైఫ్లో ఇప్పటివరకు నాస్తికుడైన (దేవుడిని నమ్మని) ఏ ఒక్క టాపర్ని లేదా విన్నర్ని చూడలేదు. తమ కష్టం తమదే అయినా, విజయం వెనుక దేవుడి అనుగ్రహం ఉందనే విషయం ప్రతీ విజేతకు తెలుసు" అని కంగనా రాసుకొచ్చారు.
వైష్ణవి తన విజయాన్ని రథయాత్ర సమయంలో జగన్నాథుడి ఆశీస్సులతో లింక్ చేస్తూ మాట్లాడటం కంగనాను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈ యంగ్ అచీవర్ను అభినందిస్తూనే దైవచింతన ప్రాముఖ్యతను కంగనా తన మార్క్ శైలిలో వివరించారు.
పార్లమెంట్ సమావేశాలు, నిరసన రాజకీయాలు
ఇదే సమయంలో దేశంలో రగులుతున్న నీట్ ఆందోళనలపై కూడా కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున, ఈ సమస్యపై సభ లోపల సమగ్రంగా చర్చించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రతిపక్షాలకు సూచించారు. సభను జరగనీయకుండా రోడ్లపై గందరగోళం సృష్టించడం ఏమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని కంగనా తప్పుపట్టారు. "ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనే విషయంలో ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణి మంచిది కాదు" అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నీట్ కాంట్రవర్సీ.. సీజేపీ ఉద్యమం
గత కొన్ని రోజులుగా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ ఆశావాదులను రోడ్డుపైకి తెచ్చింది. పరీక్షల్లో జరిగిన అక్రమాలు, తీవ్ర ఒత్తిడి కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం యావత్ భారతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ క్రమంలోనే 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పేరుతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. లడఖ్ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం, 'చలో సంసద్' మార్చ్ పై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు ఈ నిరసనలు సాగుతుండగానే, మరోవైపు వైష్ణవి దాస్ లాంటి టాపర్ల విజయాన్ని కంగనా రనౌత్ ప్రశంసించడం విశేషం.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


