ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్.. దెయ్యాలున్నాయి జాగ్రత్త
ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఇది ఆరేళ్ల కిందట వచ్చిన సినిమాకు సీక్వెల్. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమా దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ కమరొ 2 (Kamaro 2). గతంలో కమరొట్టు చెక్పోస్ట్ పేరుతో వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.

కమరొట్టు 2 ఓటీటీ రిలీజ్ డేట్
కమరొ 2 మూవీ ఓ కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. 2019లో వచ్చిన కమరొట్టు చెక్పోస్ట్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.
“కమరొట్టు చెక్ పోస్ట్ దగ్గర టెర్రర్ మళ్లీ నిద్ర లేచింది.. ఈసారి మరింత భయానకంగా, ప్రమాకరంగా మారింది. కమరో 2 నవంబర్ 7 నుంచి సన్ నెక్ట్స్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయతే ఇది కేవలం కన్నడ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది.
కమరొ 2 మూవీ గురించి..
కమరొ 2 మూవీ 2019లో వచ్చిన కమరొట్టు చెక్పోస్ట్ కు సీక్వెల్. అయితే ఆ సినిమాకు ఐఎండీబీలో 5.4 రేటింగే ఉండగా.. ఈ సీక్వెల్ కు మాత్రం 8 రేటింగ్ నమోదైంది. పరమేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో స్వామినాథన్ అనంతరామన్, రజనీ భరద్వాజ్, అనిల్ బాబీ, రక్షిత్ లాంటి వాళ్లు నటించారు. దెయ్యాల వేట సాగించే ఓ వ్యక్తి తన సోదరిని వెతుక్కుంటూ కమరొట్టు హౌస్ కు వస్తుంది.
అక్కడి వచ్చిన తర్వాత అందులోని సీక్రెట్స్ గురించి ఆమెకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆమె ఎలా బయటపడుతుంది? ఆమె సోదరి సంగతి ఏమైంది అన్నది ఈ కమరొ 2 మూవీలో చూడొచ్చు. ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


