ఓటీటీలోకి వచ్చే ముందు ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కాంతార ఛాప్టర్ 1.. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ సాధ్యం కాని రికార్డు
కాంతార ఛాప్టర్ 1 మూవీ నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 31) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అంతకు కొన్ని గంటల ముందు కూడా ఓ అరుదైన బాక్సాఫీస్ రికార్డును సొంతం చేసుకుంది.
రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన కాంతార ఛాప్టర్ 1 డిజిటల్ ప్రీమియర్ కానుంది. అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచిన ఈ మూవీ.. తాజాగా కర్ణాటకలోనూ మరో రికార్డును సొంతం చేసుకుంది.

కాంతార ఛాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డు
కాంతార ఛాప్టర్ 1 మూవీ కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకూ ఏ సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ కర్ణాటక గ్రాస్ రూ.250 కోట్ల మార్క్ అందుకుంది. నిజానికి ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమా కనీసం రూ.200 కోట్లు కూడా దాటలేదు.
కేజీఎఫ్ 2లాంటి మూవీ కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసినా.. సొంత రాష్ట్రంలో గ్రాస్ మాత్రం కాంతార ఛాప్టర్ 1 కంటే చాలా తక్కువే. ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. అటు కన్నడలోనూ కేజీఎఫ్ 2 తర్వాత ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీ కూడా ఇదే. అయితే కర్ణాటక బాక్సాఫీస్ రికార్డు మాత్రం అసలు ఊహకందనిదే.
కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్
కాంతార ఛాప్టర్ 1 మూవీ థియేటర్లలో ఉండగానే శుక్రవారం (అక్టోబర్ 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ సౌత్ వెర్షన్లే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అంటే కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం అందుబాటులోకి వస్తాయి. హిందీ వెర్షన్ కు మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది.
దీంతో ఇక్కడ వసూళ్లు పడిపోయినా.. నార్త్ లో మాత్రం ఎంతోకొంత వస్తూనే ఉంటుందన్న ధీమాతో ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మూడేళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే ఈ సినిమాను నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు నిర్మాత చలువే గౌడ చెప్పిన విషయం తెలిసిందే. థియేటర్ల కంటే ఎక్కువగా ఈ సినిమాకు ఓటీటీలో ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


