దేవుడు నా కోసం ఆ జోడీని సృష్టించలేదు-గుండె పగిలే బాధ-ఇద్దరు పిల్లలున్నారు-ఎక్కడికి వెళ్లాలి: కరణ్ జోహార్ ఎమోషనల్
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అంటే తెలియనివాళ్లు ఉండరు. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ కరణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీల్లో కరణ్ జోహార్ ఒకరు. స్టార్ కిడ్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో మరింత ఫేమస్. దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే కరణ్ జోహార్ పర్సనల్ లైఫ్ పై ఎప్పుడూ ఏవో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ కరణ్ జోహార్ ఎమోషనల్ అయ్యారు.

ఒంటరితనం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హోస్ట్ చేస్తున్న 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' షో తాజా ఎపిసోడ్కు ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సింగిల్ పేరెంట్స్ గా వారి అనుభవాలు, ప్రేమ అన్వేషణ వంటి అనేక విషయాలపై వీరిద్దరూ చర్చించారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ ఒంటరిగా భోజనం చేసేటప్పుడు తనకి ఒంటరితనం ఆవహిస్తుందని ఒప్పుకున్నారు.
గుండె పగిలిన బాధ
“నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఒకానొక సమయంలో నాకు ప్రేమ కావాలని బలంగా కోరుకున్నాను. నాకు తోడు, ఒక బంధం కావాలని ఆశపడ్డాను. ఎన్నో రకాల అనుభవాలు, గుండె పగిలిన బాధ, వన్ సైడ్ లవ్ వంటివి ఎదుర్కొన్నాను. నేను దానిపై ఒక సినిమా కూడా తీశాను. అది నాకు ఉపశమనం కలిగించింది. నేను కోలుకోవడానికి సహాయపడింది” అని కరణ్ తెలిపారు.
ఎక్కడికి వెళ్లాలి?
ఆ తర్వాత తనను తాను 'బయటకు పరిచయం చేసుకోవాలని' లేదా 'విదేశాలకు వెళ్లాలని' తనకు సలహాలు ఇచ్చారని కరణ్ జోహార్ చెప్పారు. దానికి కరణ్ బదులిస్తూ.. “ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇక్కడే ఉంటా. నాకు ఒక తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడే జీవించాలి. నేను ఆ దశలన్నీ దాటి వచ్చాను. నాకు ఒంటరితనం ఉంది. అది వాస్తవం. మీ జీవితంలో కష్టాల కంటే, సుఖాల్లోనే ఎక్కువ ఒంటరితనం అనిపిస్తుంది. ఒంటరిగా భోజనం చేయడం అనేది ఒంటరితనాన్ని మరింతగా గుర్తుచేసే విషయం” అని కరణ్ అన్నారు.
ప్రేమ కోసం
తాను ఒంటరిగా ఉండటాన్ని అంగీకరించినప్పటికీ ఒకవేళ ప్రేమ దొరికితే 'షారుఖ్ ఖాన్ ల రెండు చేతులు చాచి’ సిద్ధంగా ఉంటానని కరణ్ అన్నారు. తాను ఎన్నో గొప్ప ప్రేమ కథలను చెప్పినా, దురదృష్టవశాత్తు తనకు అలాంటిది లేదని వ్యాఖ్యానిస్తూ.. “దేవుడు నా కోసం ఆ జోడీని సృష్టించలేదు” అని అన్నారు.
కరణ్ జోహార్ ఫ్యామిలీ
కరణ్ తండ్రి, నిర్మాత యష్ జోహార్ 2004లో మరణించారు. ఆయన తన తల్లి, ముంబైలో నివసిస్తున్న హిరూ జోహార్తో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. సరోగసీ ద్వారా జన్మించిన తన ఇద్దరు పిల్లలకు, తన తల్లిదండ్రుల పేర్లను యష్, రూహీ అని పెట్టారు. ఆయన చివరిగా 2023లో రణవీర్ సింగ్, ఆలియా భట్ లతో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


