బెస్ట్ యాక్టర్ మమ్ముట్టి, బెస్ట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్.. కేరళ ఫిల్మ్ అవార్డుల లిస్టు ఇలా
కేరళ ఫిల్మ్ అవార్డుల్లో మమ్ముట్టి మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోగా.. మంజుమ్మెల్ బాయ్స్ బెస్ట్ మూవీగా నిలిచింది. సోమవారం (నవంబర్ 3) ఈ అవార్డులను ప్రకటించారు. మిగిలిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో మరోసారి సినీ దిగ్గజం మమ్ముట్టి తన సత్తా చాటాడు. కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెర్రీన్ సోమవారం (నవంబర్ 3) ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడుగా మమ్ముట్టి నిలిచాడు. హారర్ మూవీ 'భ్రమయుగం'లో అతడు పోషించిన కోడుమోన్ పోట్టి పాత్రకుగాను ఈ సీనియర్ నటుడికి మరోసారి అగ్ర పురస్కారం దక్కింది.'ఫెమినిచి ఫాతిమా' చిత్రానికి గాను షమ్లా హంజాను ఉత్తమ నటిగా ప్రకటించారు. అలాగే 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా నిలిచింది.

కేరళ ఫిల్మ్ అవార్డుల ప్రకటన
మలయాళం ఇండస్ట్రీలో బెస్ట్ మూవీస్, యాక్టర్స్ కు ఇచ్చే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సోమవారం (నవంబర్ 3) అనౌన్స్ చేశారు. త్రిస్సూర్లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వీటిని ప్రకటించారు. ఇందులో మమ్ముట్టి మరోసారి అత్యుత్తమ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది సుమారు 128 సినిమాలను జ్యూరీ పరిశీలించింది. వాటిలో 38 చిత్రాలను షార్ట్లిస్ట్ చేశారు. ప్రముఖ తమిళ నటుడు ప్రకాష్ రాజ్ ఈ జ్యూరీకి నేతృత్వం వహించాడు.
‘మంజుమ్మెల్ బాయ్స్’ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఇది ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా దర్శకుడు కూడా ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్నాడు.'ఫెమినిచి ఫాతిమా' మూవీ రెండో ఉత్తమ మలయాళ చిత్రంగా నిలవడమే కాకుండా, ఉత్తమ నటి, ఉత్తమ తొలి దర్శకుడు అవార్డులను కూడా దక్కించుకుంది. నస్లెన్, మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ 'ప్రేమలు' ఉత్తమ పాపులర్ మలయాళ చిత్రంగా నిలిచింది. మరోవైపు, మోహన్లాల్ తొలిసారి దర్శకత్వం వహించిన 'బరోజ్' చిత్రం బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (సయనోరా ఫిలిప్, భాసి వైకోం) అవార్డులను గెలుచుకుంది.
అవార్డుల జాబితా ఇలా..
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా అవార్డుల ప్యానెల్లో ఈసారి సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులతో పాటుగా పలు విభాగాల్లో గౌరవాలను దక్కించుకుంది.
ఉత్తమ సహాయ నటుడు: సౌబిన్ షాహిర్ ('మంజుమ్మెల్ బాయ్స్')
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (DOP): షైజు ఖలీద్
ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్ (ఒరిజినల్): చిదంబరం
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అజయన్ చాలస్సేరి
ఉత్తమ సౌండ్ డిజైన్: షిబిన్ మెల్విన్, అభిషేక్ నాయర్
ఉత్తమ లిరిసిస్ట్: వేదన్ ('మంజుమ్మెల్ బాయ్స్')
'ఫెమినిచి ఫాతిమా'కు మూడు కీలక అవార్డులు
'ఫెమినిచి ఫాతిమా' మూవీ ద్వితీయ ఉత్తమ మలయాళ చిత్రంగా నిలవడంతో పాటు.. ఉత్తమ నటి (షమ్లా హంజా), ఉత్తమ తొలి దర్శకుడు (ఫాజిల్ మహ్మద్) అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా ఉత్తర కేరళలోని ఒక సంప్రదాయవాద సమాజంలో వివాహిత ఎదుర్కొనే కష్టాలను సున్నితంగా, శక్తిమంతంగా చూపించింది.
నస్లెన్, మమితా బైజు నటించిన సరదా రొమాంటిక్ కామెడీ చిత్రం 'ప్రేమలు' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు గెలుచుకుంది. మోహన్లాల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'బరోజ్' చిత్రానికి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (సయనోరా ఫిలిప్, భాసి వైకోమ్) విభాగంలో అవార్డులు దక్కాయి. 'బౌగేన్విల్లా' సినిమాకుగాను సుషిన్ శ్యామ్ ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యాడు.
ఆసిఫ్ అలీకి స్పెషల్ జ్యూరీ మెన్షన్
ఉత్తమ నటుడి అవార్డు కోసం మమ్ముట్టితో పాటు ఆసిఫ్ అలీ ('లెవెల్ క్రాస్', 'కిష్కింధ కాండం'), విజయరాఘవన్ ('కిష్కింధ కాండం') మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరి రౌండ్లోనూ సీనియర్ నటుడు మమ్ముట్టి విజయం సాధించాడు. రాహుల్ సదాశివన్ హారర్ చిత్రమైన 'భ్రమయుగం'లో భయపెట్టే పాత్రలో మమ్ముట్టి నటన ఆకట్టుకుంది. ఇందులో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ భరతన్ కు కూడా ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కింది.
ఉత్తమ నటుడి అవార్డును కోల్పోయినప్పటికీ ఆసిఫ్ అలీ చేసిన కృషి గుర్తించి, అతనికి స్పెషల్ జ్యూరీ మెన్షన్ లభించింది. టొవినో థామస్ కూడా 'అజయంతే రండమ్ మోషణం' సినిమాలో మూడు విభిన్న యుగాల నుంచి మూడు పాత్రలను పోషించినందుకు స్పెషల్ జ్యూరీ మెన్షన్ అందుకున్నాడు. ఈ చిత్రానికి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు కూడా దక్కింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


