తల్లయిన తర్వాత తొలిసారి బయట కనిపించిన కియారా.. ఆమె అందం మరింత పెరిగిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ డెలివరీ తర్వాత తొలిసారి పబ్లిగ్గా కనిపించింది. ఆమెను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె ఇంత ఫిట్గా ఎలా ఉందంటూ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారా అద్వానీ మళ్లీ లైమ్లైట్లోకి వచ్చింది. తన ముద్దుల కుమార్తె సారాయా మల్హోత్రాకు జన్మనిచ్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కియారా సోమవారం (డిసెంబర్ 8) ముంబైలో తొలిసారిగా బహిరంగంగా కనిపించింది. ఆమెను చూడగానే అభిమానుల్లో, మీడియా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఆమెను చాలా ఫిట్గా ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

షూటింగ్లో తళుక్కున మెరిసిన కియారా
సోమవారం (డిసెంబర్ 8)నాడు ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసం కియారా అద్వానీ ముంబైలోని సెట్స్కు వచ్చింది. ఆమె చాలా సింపుల్గా, స్టైలిష్గా కనిపించింది. లూజ్ పౌడర్-బ్లూ షర్ట్, డెనిమ్ షార్ట్స్ లో కనిపించిన కియారా.. ఎప్పటిలాగే ఎవర్గ్రీన్ స్మైల్ తో అందరినీ పలకరించింది.
ఆమెను చూడగానే మీడియా వాళ్లు చుట్టుముట్టారు. ఒక ఫోటోగ్రాఫర్ స్పందిస్తూ.. "మేడమ్.. పాప సారాయా ఎలా ఉంది?" అని అడగగా.. కియారా ముఖం వెలిగిపోయింది. చిరునవ్వుతోనే పాప చాలా బాగుందని సైగ చేశారు. ఆ ఆప్యాయమైన పలకరింపు అభిమానుల మనసు గెలుచుకుంది.
ఇలా ఎలా సాధ్యమంటున్న ఫ్యాన్స్
డెలివరీ తర్వాత కియారా తొలిసారి కనిపించడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వరద పారుతోంది. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "ప్రసవం జరిగిన కొన్ని నెలలకే ఆమె ఇలా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఆమె ముఖంలో మాతృత్వపు కళ స్పష్టంగా కనిపిస్తోంది" అని ఒకరు కామెంట్ చేశారు.
మరొకరు ఆమెను "న్యాచురల్ గ్లామ్ క్వీన్" అని పొగడ్తలతో ముంచెత్తారు. "ఇది అసాధ్యం.. డెలివరీ తర్వాత ఇంత త్వరగా ఆమె తన ఒరిజినల్ ఫిగర్ కు ఎలా వచ్చారు? చాలా అందంగా ఉన్నారు" అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కియారా, సిద్ధార్థ్ రాకుమారి
ఇటీవలే కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేస్తూ.. పాప పేరును ‘సారాయా మల్హోత్రా’గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. "మా ప్రార్థనల నుండి, మా చేతుల్లోకి.. మా దివ్య ఆశీర్వాదం, మా రాకుమారి సారాయా" అని రాసుకొచ్చారు. ఈ పేరుకు హీబ్రూ భాషలో 'రాకుమారి' అని అర్థం ఉండటం విశేషం.
సిద్ధార్థ్, కియారా జంటకు ఈ ఏడాది జులై 15న పాప జన్మించింది. "మా హృదయాలు నిండిపోయాయి. మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది" అంటూ అప్పట్లో వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించినప్పటి నుంచే అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఈమధ్యే కియారా 'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి నటించిన విషయం తెలిసిందే.














