OTT Horror Comedy: ఓటీటీలోకి లేటస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. కుర్రాడి శరీరంలోకి బామ్మ ఆత్మ.. ఇందులోకే వచ్చేది

OTT Horror Comedy: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం హారర్ కామెడీ మూవీ రాబోతోంది. ఓ కుర్రాడి శరీరంలోకి బామ్మ ఆత్మ ప్రవేశించే ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సినిమా జీ5 ఓటీటీలోకి రానుంది.

Mar 13, 2026, 19:22:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మలయాళ హారర్ కామెడీ మూవీ 'ప్రకంపనం' (Prakambanam) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అలజడి సృష్టించేందుకు సిద్ధమైంది. యువ నటులు గణపతి, సాగర్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ త్వరలో జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం జీ5 ఇంకా వెల్లడించలేదు.

OTT Horror Comedy: ఓటీటీలోకి లేటస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. కుర్రాడి శరీరంలోకి బామ్మ ఆత్మ.. ఇందులోకే వచ్చేది
OTT Horror Comedy: ఓటీటీలోకి లేటస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. కుర్రాడి శరీరంలోకి బామ్మ ఆత్మ.. ఇందులోకే వచ్చేది

'ప్రకంపనం' స్టోరీ ఇదే

విజేష్ పనత్తూరు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ హారర్ కామెడీ మూవీ ప్రకంపనం. ఇది ముగ్గురు జాలీగా తిరిగే కాలేజీ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎటువంటి బాధ్యత లేకుండా లైఫ్ ఎంజాయ్ చేసే వీరి జీవితాల్లో ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. వారిలో ఒకరి శరీరంలోకి ఒక బామ్మ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లు పడే ఇబ్బందులు, ఆ ఆత్మ చేసే హంగామా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.

సీనియర్ నటి మల్లికా సుకుమారన్ ఆత్మగా నటించిన బామ్మ పాత్రలో అద్భుతంగా మెప్పించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే కన్నుమూసిన దివంగత నటుడు కళాభవన్ నవాస్ కూడా ఇందులో నటించడం విశేషం. రాజేష్ మాధవన్, అజీస్ నెడుమంగడ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ప్రకంపనం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలైన ‘ప్రకంపనం’.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. కేవలం సరదాగా, మైండ్ ఫ్రీగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.

ఇప్పటికే థియేటర్లలో రిలీజై ఆరు వారాలు దాటింది. దీంతో ఈ మార్చి నెల చివరిలోగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. మరోవైపు జీ5 ఓటీటీయే ఇదే నెల అంటే మార్చి 20న 'కాసరగోడ్ ఎంబసీ' అనే మలయాళ వెబ్ సిరీస్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More