ఓటీటీలోకి ఒక రోజు ముందే మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్

మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని మూవీని స్ట్రీమింగ్ చేయనున్న సోనీ లివ్ ఓటీటీయే వెల్లడించింది. దృశ్యం డైరెక్టర్ తీసిన థ్రిల్లర్ సినిమా కావడంతో దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Published on: Oct 15, 2025 8:40 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి మిరాజ్ (Mirage). నిజానికి దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ అన్ని సినిమాల్లో ఇదే కాస్త బలహీనంగా ఉందన్న టాక్ వచ్చినా.. మొత్తంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అయితే అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగానే కావడం విశేషం.

ఓటీటీలోకి ఒక రోజు ముందే మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఒక రోజు ముందే మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్

మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన మూవీ మిరాజ్. ఇందులో అపర్ణ బాలమురళీ కూడా నటించింది. ఈ మిరాజ్ సినిమాను ముందు చెప్పినదాని కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ఓటీటీ బుధవారం (అక్టోబర్ 15) వెల్లడించింది.

“మీకు స్టోరీ తెలుసని అనుకుంటారు.. ఓ ట్విస్ట్ ఎదురైతేగానీ తెలియదు. మిరాజ్ ఒక రోజు ముందుగానే అక్టోబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఫుల్ ట్విస్టులు, థ్రిల్స్ అందించే ఆదివారం కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ట్వీట్ చేసింది.

కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సాధించిన మిరాజ్ మూవీని అక్టోబర్ 19 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.

మిరాజ్ మూవీ గురించి..

దృశ్యం సిరీస్‌తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడు దృశ్యం 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే అతని డైరెక్షన్ లో వచ్చిన మూవీయే ఈ మిరాజ్. గత నెల 19న థియేటర్లలో రిలీజైంది. ఇందులో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ లీడ్ రోల్స్ లో నటించారు. ఇక మిరాజ్ కథ విషయానికొస్తే.. అభిరామి (అపర్ణ బాలమురళి) తన లవర్ కిరణ్ (హకీమ్ షాజహాన్)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌ నుంచి అభిరామికి కాల్ వస్తుంది. దాంతో పీఎస్‌కు వెళ్లిన అభిరామికి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దాంతో షాక్‌లోకి వెళ్తుంది అభిరామి.

ఆ షాక్ నుంచి తేరుకోకముందే అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి పోలీస్ నుంచి రౌడీల వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్‌ది నిజంగా యాక్సిడెంటా? అభిరామిని అడిగిన హార్డ్ డిస్క్‌లో ఏముంది? అభిరామికి ఎదురైన ప్రమాదం ఏంటీ? దాని నుంచి తప్పించుకుందా? అనేటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిరాజ్ తెరకెక్కింది.

సహజంగానే ఓటీటీల్లో మలయాళం థ్రిల్లర్ సినిమాలకు చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దృశ్యం డైరెక్టర్ థ్రిల్లర్ సినిమా కావడంతో మిరాజ్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.