ఓటీటీలో బిగ్ బాస్ హవా.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 షోస్లో మూడు బిగ్ బాస్వే.. అందనంత ఎత్తులో హిందీ షో
ఓటీటీలో బిగ్ బాస్ హవా నడుస్తోంది. ఒక్క తెలుగు షోనే కాదు.. టాప్ 5 ఎక్కువ వ్యూస్ సాధించిన షోలలో బిగ్ బాస్ హిందీ, తమిళం కూడా ఉండటం విశేషం. గత వారం అంటే నవంబర్ 3 నుంచి 9 వరకు ఎక్కువ వ్యూస్ పొందిన నాన్ ఫిక్షన్ షోల వివరాలను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.
ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్న టాప్ 5 నాన్ ఫిక్షన్ షోస్ ఏవో తెలుసా? ఈ షోస్ విషయంలో జియోహాట్స్టార్ పంట పండిందనే చెప్పాలి. ఎందుకంటే టాప్ 5లో నాలుగు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నవే. ఇక మూడు భాషలకు చెందిన బిగ్ బాస్ షోలు కూడా ఇందులో ఉండటం విశేషం.

బిగ్ బాస్ హిందీ సీజన్ 19
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఈ షోకి గత వారం ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. జియోహాట్స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త సీజన్ ప్రారంభమైన తొలి వారం నుంచే టాప్ లో ఉంటూ వస్తోంది. ప్రతివారం వ్యూస్ పెరుగుతూనే ఉండటం విశేషం.
పతీ పత్నీ ఔర్ పంగా
ఇది కూడా జియోహాట్స్టార్ ఓటీటీలో వస్తున్న షో. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే జడ్జిగా ఉన్న షో ఇది. దీనికి గత వారం 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో ఉన్నా కూడా.. బిగ్ బాస్ హిందీతో పోలిస్తే చాలా తక్కువ వ్యూస్ మాత్రమే ఉన్నాయి.
కౌన్ బనేగా కరోడ్పతి
ఇక ఈ లిస్టులో ఉన్న మరో షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 17. ఇది సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే క్విజ్ షో ఇది. ఈ షోకి గత వారం 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది కూడా కొత్త సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ టాప్ 5లో ఉంటూ వస్తోంది.
బిగ్ బాస్ తమిళం సీజన్ 9
టాప్ 5లో ఉన్న మరో బిగ్ బాస్ షో ఇది. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళం సీజన్ 9 కూడా జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి గత వారం 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
చివరిగా ఐదో స్థానంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉంది. జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి గత వారం 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఈసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


