Ajay Arasada: పవన్ కళ్యాణ్ నా మ్యూజిక్ విని పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు: మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ

Ajay Arasada: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను కలవడం, తనతో ఆయన సరదాగా మాట్లాడటం గురించి అజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Published on: Aug 18, 2026, 15:11:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ajay Arasada: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకోవడం అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కైనా మైండ్ బ్లోయింగ్ మూమెంట్. రీసెంట్‌గా టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్ అజయ్ అరసాడను పవన్ పర్సనల్‌గా పిలిపించుకుని ఏకంగా అరగంట సేపు మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Ajay Arasada: పవన్ కళ్యాణ్ నా మ్యూజిక్ విని పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు: మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ
Ajay Arasada: పవన్ కళ్యాణ్ నా మ్యూజిక్ విని పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు: మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ

'ఆయ్', 'సేవ్ ది టైగర్స్', 'వికటకవి' వంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అజయ్ అరసాడ తన పదేళ్ల సినీ జర్నీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్‌తో మీటింగ్.. ఆ కాఫీ కప్పు కామెడీ

జనసేన రాజకీయ ప్రచారాలతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవన్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వర్క్ చూసిన వెంటనే పవన్ ఆయన్ని పిలిపించి పీకే క్రియేటివ్స్ బ్యానర్‌లో అప్ కమింగ్ ప్రాజెక్టులతో పాటు పొలిటికల్ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేద్దామని హామీ ఇచ్చారు.

ఈ మీటింగ్‌లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను అజయ్ షేర్ చేసుకున్నారు. తన దగ్గరున్న కాఫీ కప్పు షేప్ బోస్ స్పీకర్‌ను చూసి పవన్ కళ్యాణ్ సరదాగా నవ్వేశారు. "ఏంటి నాకోసం కాఫీ పట్టుకొచ్చావా?" అంటూ పవన్ వేసిన జోక్‌కు అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పవర్ స్టార్ లాంటి బిగ్ పర్సనాలిటీ తనతో అంత క్లోజ్‌గా సరదాగా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు.

టీసీఎస్ సాఫ్ట్‌వేర్ జాబ్ నుంచి టాలీవుడ్ వరకు..

వైజాగ్ నుంచి వచ్చిన అజయ్ అరసాడ కెరీర్ చాలా ఇన్స్పైరింగ్. టీసీఎస్ (TCS) కంపెనీలో ఏడేళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తూనే మ్యూజిక్ కంపోజిషన్ వైపు అడుగులు వేశాడు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్ఫూర్తితో, ఫ్రెండ్ శ్రీచరణ్ పాకాల హెల్ప్‌తో 'గూఢచారి' సినిమాకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తన కెరీర్ రీ-స్టార్ట్ చేశాడు.

చిన్న సినిమాలకు పనిచేసేటప్పుడు పేమెంట్స్ విషయంలో తనకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, మంచి ప్రొడక్షన్ హౌసెస్ సపోర్ట్ లభించిందని చెప్పారు. ప్రాంతం లేదా భాషతో సంబంధం లేకుండా కథకు ఏం కావాలో అదే డిజైన్ చేయడం తన శైలి అని స్పష్టం చేశారు.

ఓటీటీ ఆడియో కంప్రెషన్.. ఏఐ (AI) భయం నిజమేనా?

'వికటకవి' వంటి వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో సౌండ్ డిజైనింగ్ క్రెడిట్ తగ్గుతోందని అజయ్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. థియేటర్‌లో ఉండే విజువల్ గ్రాండియర్, సౌండింగ్ ఎక్స్‌పీరియన్స్ ఓటీటీ ఆడియో కంప్రెషన్‌లో 50 శాతానికి పడిపోతుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై మాట్లాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల టాలెంట్‌ను ఏఐ రీప్లేస్ చేయలేదని తేల్చి చెప్పారు. ఏఐ ప్రాంప్టింగ్ ద్వారా ట్రాక్స్ తెప్పించుకోవచ్చేమో గానీ, కంపోజర్ ఇచ్చే ఒరిజినాలిటీని అది మ్యాచ్ చేయలేదని నవ్వుతూ చెప్పారు.

'ఆయ్' క్రెడిట్ వివాదం.. యంగ్ డైరెక్టర్ల సమస్య

'ఆయ్' సినిమా హిట్ అయినా మీడియాలో రామ్ మిర్యాల పేరు మాత్రమే ఎక్కువగా ప్రమోట్ అవ్వడంపై కూడా అజయ్ స్పందించారు. అప్పట్లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ స్వయంగా ప్రతీ ఈవెంట్‌లో తన పేరును హైలైట్ చేస్తూ అవసరమైన క్రెడిట్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం వస్తున్న చాలా మంది యంగ్ డైరెక్టర్లు సీన్ ఎమోషన్ చెప్పగలుగుతున్నారు గానీ, మ్యూజిక్ కాన్సెప్ట్ ఏంటో క్లారిటీగా చెప్పలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. కాన్సెప్ట్ సరిగ్గా చెప్తేనే లిరిసిస్ట్‌లకు, కంపోజర్లకు మంచి ట్యూన్స్ ఇచ్చే స్కోప్ ఉంటుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

మధ్యలో కరోనా వల్ల కొంత కాలం వేస్ట్ అయినా, ఈ పదేళ్ల జర్నీలో ఏ పెద్ద కమర్షియల్ సినిమాకైనా మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని, సరైన బిగ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని అజయ్ ముగించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More