ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి జాన్వీ కపూర్ నటించిన మూవీ వస్తోంది. ఈసారి ఇండియా నుంచి ఆస్కార్స్ కి అధికారిక ఎంట్రీ అయిన హోమ్‌బౌండ్ మూవీ ఇది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Nov 14, 2025, 15:03:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాన్వీ కపూర్ నటించిన మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ డ్రామా మూవీ 'హోమ్‌బౌండ్'. ఈ సినిమా నవంబర్ 21న డిజిటల్ ప్రీమియర్ కానుంది. సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తర్వాత ఇండియా నుంచి ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీగా నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా ఎంపికైంది.

ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

'హోమ్‌బౌండ్' ఓటీటీ రిలీజ్ డేట్

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన మూవీ హోమ్‌బౌండ్. ఈ సినిమా సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కాగా.. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రఖ్యాత దర్శకుడు మార్టిన్ స్కోర్సెసే ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన ‘హోమ్‌బౌండ్’.. నార్త్ ఇండియా నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. మొహమ్మద్ షోయబ్ అలీ (ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జేత్వా) చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ పోలీస్ అధికారులు కావాలని కలలు కంటుంటారు.

ప్రభుత్వ ఉద్యోగం ద్వారా పొందాలనుకునే గౌరవం, ఆత్మగౌరవానికి ఎదురయ్యే సవాళ్లేంటన్నది ఈ హోహ్‌బౌండ్ మూవీలో చూడొచ్చు. మత, కుల అసమానతలు వాళ్ల కలలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయో డైరెక్టర్ ఘైవాన్ ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించాడు.

హోమ్‌బౌండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

2020లో కశ్మీరీ రచయిత బషరత్ పీర్ రాసిన ఒక న్యూయార్క్ టైమ్స్ కథనం ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చిందని చెబుతున్నారు. ఆ కథనం COVID-19 లాక్‌డౌన్ సమయంలో యువ వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర.. అణగారిన వర్గాలు ఎదుర్కొనే నిర్మాణాత్మక అడ్డంకులకు అద్దం పడుతుంది.

ఘైవాన్ 2015లో విమర్శకుల ప్రశంసలు పొందిన 'మసాన్' తర్వాత తీసిన రెండవ సినిమా 'హోమ్‌బౌండ్'. ఈ కొత్త సినిమా కూడా మసాన్ లాగే ప్రశంసలు అందుకుంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ సమయంలో ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది.

దేశీయంగా విడుదలైన తర్వాత కూడా ఘైవాన్ సాహసోపేతమైన దర్శకత్వం, బలమైన డైలాగులు, ముఖ్యంగా లీడ్ యాక్టర్స్ అద్భుతమైన నటన విమర్శకులను ప్రశంసలు అందుకున్నాయి. కుల వివక్ష, సామాజిక కథనాన్ని సున్నితంగా చూపినందుకు ఈ సినిమా ఇండియా నుంచి ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీగా వెళ్లింది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన అభిమానులు నవంబర్ 21 నుండి నెట్‌ఫ్లిక్స్ లో చూడవచ్చు.