నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?

నెట్‌ఫ్లిక్స్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నా.. ఓ ఐదు సినిమాలను మాత్రం రిలీజ్ అయిన తర్వాత నిషేధించారన్న విషయం మీకు తెలుసా? వివిధ కారణాలతో ఈ సినిమాలను కొన్ని దేశాల్లో స్ట్రీమింగ్ చేయడం లేదు.

Published on: Oct 14, 2025, 13:52:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో దాదాపు ప్రతిరోజూ బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ మొదలైన తర్వాత వివాదాలు తలెత్తడంతో నిషేధించాల్సి వచ్చింది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అభ్యంతరాలు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ సినిమాలేవో తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?
నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?

నెట్‌ఫ్లిక్స్‌లోని వివాదాస్పద సినిమాలు

ఓటీటీలో ఏదైనా సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఒక లాభం ఏంటంటే.. మేకర్స్ సినిమా లేదా సిరీస్ నిడివి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఒక కథను వెబ్ సిరీస్ లో మరింత వివరంగా చూపించవచ్చు. అంతేకాకుండా సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు, వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఉండేటటువంటి ఎన్నో రకాల లైసెన్సులు తీసుకోవాల్సిన కష్టం కూడా ఉండదు. అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినా వివాదాలు పెరగడం వల్ల లేదా మరేదైనా కారణం చేత మేకర్స్ వాటిని ఓటీటీలో కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద బ్రిడ్జ్

ఈ సినిమాలో చాలా అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. దీంతో 2015లో వచ్చిన ఈ సినిమాను న్యూజిలాండ్‌లో బ్యాన్ చేశారు. అంటే నెట్‌ఫ్లిక్స్ లో న్యూజిలాండ్ ప్రేక్షకులు ఈ మూవీని చూడలేరు. వివాదం ఎంత పెరిగిందంటే నెట్‌ఫ్లిక్స్ దీన్ని బ్యాన్ చేయక తప్పలేదు.

ఫుల్ మెటల్ జాకెట్

ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గుట్టును బయటపెట్టే ఈ సినిమాను కూడా 2017లో రిలీజ్ చేశారు. కానీ వియత్నాం బిజినెస్ లాబీ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడంతో ఈ సినిమాను బ్యాన్ చేశారు.

నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్

ఈ సినిమాను కూడా వివాదాస్పదమైన సీన్స్ కారణంగా బ్యాన్ చేశారు. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమాను జర్మనీలో స్ట్రీమింగ్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో విపరీతమైన హింస, ఇంకా ఇతర అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. విమర్శల తర్వాత దీన్ని బ్యాన్ చేశారు.

ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్

ఈ సినిమాలో ఏసుక్రీస్తు తల్లి మేరీ శారీరక సంబంధం పెట్టుకోవడం.. సాతాను యేసును శోధించడం చూపించారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉండడం వల్ల చాలా మంది ఇది దైవదూషణ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయించారు.

ద లాస్ట్ హ్యాంగోవర్

ఈ సినిమాలో కూడా దేవుడి గురించి చాలా అభ్యంతరకరమైన విషయాలు చూపించారు. దీంతో ఎంతో మంది మనోభావాలు దెబ్బతినడంతో దీన్ని ఓటీటీ నుండి తీసేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More