Ninnu Kori September 1 Episode: నిన్ను కోరి- నిశ్చితార్థంలోపు మదన్ను నరికేస్తా- విరాట్ వార్నింగ్- చంద్రకళపై మాయ డౌట్
Ninnu Kori Serial September 1st Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్లో విరాట్ కత్తి నూరుతుంటాడు. నా భార్యకు వేరేవాడితో ఎంగేజ్మెంట్ చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా. నిశ్చితార్థంలోపు వాడిని నేను నరికేస్తా అని విరాట్ వార్నింగ్ ఇస్తాడు. చంద్రకళ కావాలనే విరాట్ను రెచ్చగొడుతుంది.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మదన్ను చంపేందుకు విరాట్ కోపంగా కత్తిని నూరుతుంటాడు. అది చూసి జగదీశ్వరి తెగ భయపడిపోతుంది. వెళ్లి రఘురామ్కి చెబుతుంది. చంద్రకళ కూడా విరాట్ కత్తి నూరడం చూసి భయపడిపోతుంది.

వాడిని నరికేస్తాను
ఆయనేమే కత్తులు నూరుతున్నారు, మావయ్య, అత్తయ్య నా ఎంగేజ్మెంట్ చేయాలని చూస్తున్నారని టెన్షన్ పడుతుంది చంద్రకళ. తర్వాత రఘురామ్తో నా భార్యకు ఇంకొకరితో పెళ్లి చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా, ఈ నిశ్చితార్థం జరిగేలోపు వాడిని నరికేస్తాను నాన్న అని విరాట్ అంటాడు.
ఆ మదన్ను విరాట్ నిజంగానే చంపేసేలా ఉన్నాడని జగదీశ్వరికి చెబుతాడు రఘురామ్. అక్కడే క్రాంతి కూడా ఉంటాడు. మరోవైపు చంద్రకళ, మదన్ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. సాయింత్రం సమయంలో ఇంట్లోని హాల్లోకి ఈవెంట్ మేనేజర్ వచ్చి చంద్రకళకు రకరకాల డెకరేషన్ డిజైన్స్, పూల అలంకరణలను చూపిస్తుంటాడు.
భర్తను రెచ్చగొట్టిన చంద్రకళ
అదే సమయంలో విరాట్ లాప్టాప్తో హాల్లోకి వస్తాడు. అతన్ని చూడగానే చంద్ర కావాలనే వాయిస్ పెంచి, శాలినితో డిస్కస్ చేస్తుంటుంది. "ఆ ఫ్లవర్స్ వద్దు, మదన్ గారికి లావెండర్ ఫ్లవర్స్ అంటే ఇష్టం. డెకరేషన్ అంతా చాలా రిచ్గా, క్లాసీగా ఉండాలి" అంటూ విరాట్కు గట్టిగా వినపడేలా రెచ్చిపోతుంటుంది చంద్రకళ.
అదంతా విన్న విరాట్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. వెంటనే చంద్రకళ తన మనసులో మాత్రం... తన భర్త వేరొకరితో జరిగే పెళ్లి మండపం డిజైన్ తననే సెలెక్ట్ చేయమనడంతో విరాట్ ఎంతలా రగిలిపోతున్నాడో చూసి ఆనందిస్తుంది.
మాయ, శాలిని, మందరల చర్చ
చంద్రకళ ఉత్సాహాన్ని గమనించిన మాయ, శాలిని, మందరల మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. "చంద్రకళ ప్రవర్తన చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఈ పెళ్లికి తనే ఇంత హ్యాపీగా ఉండే అవకాశం అసలు లేదు, దీని వెనుక ఏదో ప్లాన్ ఉంది" అని మాయ అంటుంది. దానికి శాలిని కూడా అదే సందేహం వ్యక్తం చేస్తుంది.
అయితే ఈ పెళ్లి ఎలాగైనా జరిగిపోవాలని, ముందు ఇది అయిపోయి ఈ ఇంట్లోనుంచి చంద్రకళ వెళ్లిపోతే మనకు శని వదులుతుంది అంటుంది మందర. కానీ కామాక్షి, శ్రుతిలు మాత్రం ఈ పెళ్లి జరగకుండా చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారని శాలిని అసలు విషయం బయటపెడుతుంది.
ఎవరి ప్లాన్లు వారివే
కామాక్షి, శ్రుతిల వేదన: పెళ్లి ఎలా ఆపాలి అని రకరకాల ఫన్నీ పాసిబిలిటీస్ గురించి వాళ్లు మాట్లాడుకుంటారు (పవర్ కట్ చేయడం, పంతులుని బెదిరించడం లేదా మదన్కి కడుపునొప్పి వచ్చే మందు కలిపి ఇవ్వడం లాంటివి).
చంద్ర ఆలోచన: బావ ఇగో హర్ట్ అవ్వకుండా ఈ పెళ్లిని తన చేతులతో ఎలా చెడగొట్టాలి అని సీరియస్గా ఆలోచిస్తుంటుంది.
రఘురామ్ ఆగ్రహం: మదన్ను అమెరికా నుంచి పిలిపించి ఏమైనా మర్డర్ చేయడానికి తీసుకువచ్చారా? వాడిని చంపేయకముందే ఇక్కడి నుంచి పంపించేయండి అంటూ రఘురామ్ కోపంగా ఊగిపోతుంటాడు.
నిశ్చితార్థ వేడుకలో గ్రాండ్ ఎంట్రీ
మరుసటి రోజు నిశ్చితార్థ సెటప్ చాలా గ్రాండ్గా ఉంటుంది. హాల్లో ఒక మూల నిలబడిన విరాట్.. మదన్ను అత్యంత కోపంగా చూస్తూ, రోజు వాడిని ఎలానైనా వేసేయాలని ఫీల్ అవుతుంటాడు. మరోవైపు శాలిని ఒక సీక్రెట్ ఏజెంట్లా ఎక్కడ ఫోకస్ చేయకుండా కేవలం చంద్రకళనే అబ్సర్వ్ చేస్తుంటుంది.
పంతులు గారికి పూజా సామాగ్రి అందిస్తూ క్రాంతి హెల్ప్ చేస్తుంటే.. "వీడేదో పెళ్లికి రెడీ అవుతాడు అనుకుంటే.. పంతులు పక్కన కూర్చుని పూజలు చేయిస్తున్నాడేంటి?" అని శాలిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


