Oh..! Sukumari Trailer: ముట్టుకుంటే షాకే.. ఫన్నీ లవ్ స్టోరీకి షాకింగ్ ట్విస్ట్.. తిరువీర్, ఐశ్వర్య ఓ సుకుమారి ట్రైలర్
Oh..! Sukumari Trailer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఓ సుకుమారి ట్రైలర్ వచ్చేసింది. ఓ ఫన్నీ లవ్ స్టోరీకి షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ సాగిన ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ జులై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Oh..! Sukumari Trailer: టాలీవుడ్ బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'ఓ సుకుమారి' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వింత వ్యాధితో బాధపడే అమ్మాయి కథతో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 'మసూద' ఫేమ్ తిరువీర్, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.

ముట్టుకుంటే షాక్.. దామిని అసలు సీక్రెట్ ఇదే
కొత్త డైరెక్టర్ భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఓ సుకుమారి సినిమా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక పల్లెటూరి ప్రేమకథ వెనుక దాగి ఉన్న ఓ వింత సమస్య చుట్టూ ఈ స్టోరీ మొత్తం తిరుగుతుంది.
దామిని అనే క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఒక అరుదైన సమస్య ఉంటుంది. ఆమెను ఎవరైనా టచ్ చేస్తే వెంటనే గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ నిజం తెలిస్తే అసలు పెళ్లే కాదని ఆమె ఫ్యామిలీ భయపడుతుంది.
అందుకే ఈ సీక్రెట్ ను ప్రపంచానికి దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా హీరో తిరువీర్ కి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కానీ పెళ్లయ్యాక ఆ ఫస్ట్ నైట్ రోజే హీరోకు అసలు నిజం తెలుస్తుంది. భార్యను ముట్టుకుంటే షాక్ కొట్టే ఆ వింత సమస్యతో హీరో పడే పాట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
యాక్టింగ్తో అదరగొట్టిన తిరువీర్, ఐశ్వర్య
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో తిరువీర్ చాలా నేచురల్ గా చేశాడు. ఆ క్యారెక్టర్ లోని అమాయకత్వంతో పాటు తన మార్క్ కామెడీ టైమింగ్ తో భలే నవ్వించాడు. గతంలో 'మసూద', 'పరేషాన్' లాంటి సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న తిరువీర్ కు ఈ సినిమా మరో సాలిడ్ హిట్ ఇచ్చేలా కనిపిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.
ఇక ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్', సంక్రాంతికి వస్తున్నాం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు మంచి ఎమోషన్స్, కామెడీ టైమింగ్ రెండూ కలగలిపిన పాత్రలో అదరగొట్టేసింది. వీళ్ళిద్దరి జంట స్క్రీన్ మీద చాలా క్యూట్ గా వర్కౌట్ అయింది.
ఓ సుకుమారి మూవీ విశేషాలు
గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా చాలా రిచ్ గా ఖర్చుపెట్టారు. డైరెక్టర్ భరత్ దర్శన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ఈ ఎంటర్టైనర్ ను రెడీ చేశాడు. సి.హెచ్. కుశేందర్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను స్క్రీన్ పై చాలా నేచురల్ గా చూపించింది.
అలాగే భరత్ మంచిరాజు అందించిన ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మేజర్ హైలైట్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ ఆడియన్స్ పై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. సరిగ్గా వారం రోజుల్లో అంటే ఇదే నెల 17న 'ఓ సుకుమారి' థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రొమాంటిక్ కామెడీ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


