OTT Malayalam: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్
OTT Malayalam: ఓటీటీలోకి ఇప్పుడో మంచి సెటైరికల్ మలయాళం కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా తెలుగులోనూ నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.
మలయాళం సినిమాల్లో నటుడి నుంచి దర్శకుడిగా మారిన రాజేష్ మాధవన్ తెరకెక్కించిన షార్ప్ సెటైరికల్ డ్రామా 'పెన్నుమ్ పోరాట్టమ్' (Pennum Porattum). ఫిబ్రవరి 13న కేరళ థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ (OTT) లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'నెట్ఫ్లిక్స్' (Netflix).. మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసింది.

పెన్నుమ్ పోరాట్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
మూవీ పేరు: పెన్నుమ్ పోరాట్టమ్
ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ తేదీ: మార్చి 13, 2026
అందుబాటులో ఉండే భాషలు: తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ
పెన్నుమ్ పోరాట్టమ్ అసలు కథ ఏంటంటే..
కేరళలోని పాలక్కాడ్ (Palakkad) నేపథ్యంలో సాగే ఈ కథ అద్భుతమైన డార్క్ కామెడీతో నడుస్తుంది. బయటకి చాలా ప్రశాంతంగా, పద్ధతిగా కనిపించే ఒక ఊరి జనాలు.. నిజానికి ఎంత క్రూరంగా ఉంటారనేది ఈ సినిమాలో సెటైరికల్గా చూపించారు.
చారులత అనే ఒక బోల్డ్ ఉమన్, అలాగే ఒక కుక్క.. ఆ ఊరి వాళ్లు పెట్టిన కండిషన్స్ను బ్రేక్ చేసినప్పుడు, ఊరి జనాలు వాళ్లను ఎలా వెంబడించారు? ఆ ప్రయాణంలో మనుషుల నైతికత, కోరికలు, హింసను డైరెక్టర్ ఎలా ఎక్స్పోజ్ చేశారనేదే ఈ సినిమా అసలు కథ. రైనా రాధాకృష్ణన్, దినేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉంది.
పెన్నుమ్ పోరాట్టమ్ హైలైట్స్
ఈ సినిమాలో 'సుట్టు' (Suttu) అనే డాల్మేషియన్ కుక్కకు మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ వాయిస్ ఓవర్ చెప్పడం ఈ మూవీకే పెద్ద హైలైట్. ఆ కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.
మీకు ‘అవిహితం’ లాంటి బెస్ట్ మలయాళ సినిమాలు నచ్చితే, ఈ మూవీ కూడా కచ్చితంగా నచ్చుతుంది. మోరల్ పోలీసింగ్, వయొలెన్స్ లాంటి సీరియస్ టాపిక్స్ను ఒక థియేట్రికల్ అప్రోచ్తో డైరెక్టర్ రాజేష్ మాధవన్ అద్భుతమైన హ్యూమర్తో చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశాడు. డైరెక్టర్గా అతనికి ఇది మొదటి సినిమానే అయినా ఈ కాంప్లెక్స్ సబ్జెక్ట్ను అతను హ్యాండిల్ చేసిన విధానం మూవీ చూశాక కచ్చితంగా ఒక టాకింగ్ పాయింట్ అవుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


