మహారాణి.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లోని సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ వచ్చే వారమే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బుధవారం (అక్టోబర్ 29) రిలీజైన ట్రైలర్ ఎంతో ఉత్కంఠ రేపేలా సాగింది.
మహారాణి సీజన్ 4 ట్రైలర్

ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించిన వెబ్ సిరీస్ మహారాణి. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ప్రతి సీజన్ కు ఉత్కంఠ రేపుతూ వెళ్తున్న ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈసారి ఫైట్ బీహార్ వర్సెస్ ఢిల్లీ అనేలా సాగింది.
మహారాణి బీహార్ వదిలి ఏకంగా ఢిల్లీ ప్రధానమంత్రి పీఠంపై కన్నేయడం ఇందులో చూడొచ్చు. తాజాగా రిలీజైన ట్రైలర్లో రాణీ భారతి సీఎం పీఠాన్ని తన కూతురికి అప్పగించి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టడం చూడొచ్చు. అదే సమయంలో ఆమె కొడుకు చేసే అరాచకాన్ని కూడా చూపించారు. ఈ ట్రైలర్ ఢిల్లీలోని సంకీర్ణ కేంద్ర ప్రభుత్వానికి ఓ పార్టీ మద్దతు ఉపసంహించుకునే సీన్ తో మొదలైంది.
ఆ పార్టీ స్థానంలో కేంద్రానికి మద్దతిచ్చే ఏకైక వ్యక్తిగా రాణీ భారతి సీన్ లోకి ఎంటరైంది. అయితే తాను మద్దతిచ్చే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి ఆఫర్ ను తిరస్కరిస్తుంది. అప్పుడే ఆమె అసలు కష్టాలు మొదలవుతాయి. పాత శత్రువులు, కొత్త శత్రువులు కలిసి ఆమెను ఓ పాత కేసులో మళ్లీ జైలు పాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ కొత్త సవాలును రాణీ భారతి ఎలా ఎదుర్కొంటుందన్నది మహారాణి సీజన్ 4లో చూడొచ్చు. ఈ కొత్త సీజన్ నవంబర్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మహారాణి వెబ్ సిరీస్ గురించి..
మహారాణి వెబ్ సిరీస్ తొలి సీజన్ 2021లో మొదలైంది. సుభాష్ కపూర్ క్రియేట్ చేశాడు. తొలి సీజన్ ను కరణ్ శర్మ డైరెక్ట్ చేయగా.. రెండో సీజన్ ను రవీంద్ర గౌతమ్, మూడో సీజన్ ను సౌరభ్ భవే డైరెక్ట్ చేశారు. మూడు సీజన్లు కలిపి 28 ఎపిసోడ్లు వచ్చాయి. చివరిగా మూడో సీజన్ గతేడాది మార్చిలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు నాలుగో సీజన్ వస్తోంది.
{{/usCountry}}మహారాణి వెబ్ సిరీస్ తొలి సీజన్ 2021లో మొదలైంది. సుభాష్ కపూర్ క్రియేట్ చేశాడు. తొలి సీజన్ ను కరణ్ శర్మ డైరెక్ట్ చేయగా.. రెండో సీజన్ ను రవీంద్ర గౌతమ్, మూడో సీజన్ ను సౌరభ్ భవే డైరెక్ట్ చేశారు. మూడు సీజన్లు కలిపి 28 ఎపిసోడ్లు వచ్చాయి. చివరిగా మూడో సీజన్ గతేడాది మార్చిలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు నాలుగో సీజన్ వస్తోంది.
{{/usCountry}}ఇందులో రాణీ భారతి అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించింది. ఓ చదువు రాని గ్రామీణ మహిళ పాత్ర నుంచి బీహార్ లాంటి రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రిగా ఆమె ఎదిగిన తీరును ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. అయితే నాలుగో సీజన్ లో ఆమె ఏకంగా ప్రధాని పదవిపైనే కన్నేయడం ఆసక్తికరంగా మారింది.