మన టైమ్ స్టార్ట్ అయింది.. ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. డిఫరెంట్ లుక్స్‌లో ప్రభాస్

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చేసింది. ఏకంగా 3 నిమిషాలపై ఉన్న ఈ ట్రైలర్ అదిరిపోయింది. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్స్ లో చూపిస్తూ ఉర్రూతలూగించింది. మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.

Published on: Dec 29, 2025, 15:12:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ది రాజా సాబ్ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్స్ లో చూపిస్తూ సాగింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోతున్న సునామీకి ఈ ట్రైలర్ మరింత దోహదం చేయనుంది.

మన టైమ్ స్టార్ట్ అయింది.. ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. డిఫరెంట్ లుక్స్‌లో ప్రభాస్
మన టైమ్ స్టార్ట్ అయింది.. ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. డిఫరెంట్ లుక్స్‌లో ప్రభాస్

ది రాజా సాబ్ ట్రైలర్ 2.0

ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “ది రాజా సాబ్ ట్రైలర్ 2.0.. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువే. పర్ఫార్మెన్సెస్, విజువల్స్, మ్యూజిక్.. అన్నీ కలిసి ఓ అద్భుతమైన అనుభవాన్ని ఈ సంక్రాంతికి అందించనుంది. జనవరి 9, 2026న థియేటర్లలో..” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ట్వీట్ చేసింది.

గతంలో వచ్చిన ట్రైలర్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ మరింత గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, అన్నింటికీ మించి ప్రభాస్ వైలెంట్ లుక్స్ తో మూవీపై మరింత అంచనాలు పెంచేసింది.

ది రాజా సాబ్ ప్రీ సేల్స్

ఇక ది రాజా సాబ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొడుతున్నాయి. రిలీజ్ కు పది రోజుల ముందే రూ.2 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విడుదలకు ఇంకా 10 రోజులు ఉండగానే ప్రీ-సేల్స్ కలెక్షన్స్ అదిరిపోయాయి.

'సలార్', 'కల్కి 2898 AD' వంటి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది రాజా సాబ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఓవర్సీస్ బుకింగ్స్ రిపోర్ట్ చూస్తుంటే ప్రభాస్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సోమవారం (డిసెంబర్ 29) ఉదయం రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. డిసెంబర్ 28 నాటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సుమారు 2 లక్షల డాలర్లు దాటాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 29 ఉదయానికి కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జనవరి 9న ఇండియాలో రిలీజ్ కానుండగా.. జనవరి 8నే అమెరికాలో ప్రీమియర్స్ పడనున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More