Priya Prakash Varrier: కాషాయ రంగు డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో షాక్.. ఆమె రియాక్ష్ ఇలా

Priya Prakash Varrier: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె వేసుకున్న డ్రెస్ కలర్ ను కూడా రాజకీయం చేయాలని చూసిన ఓ యూట్యూబర్ కు ఆమె గట్టి సమాధానం ఇచ్చింది.

Published on: Aug 6, 2026, 18:09:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Priya Prakash Varrier: ఒక్క వింక్ తో దేశాన్నంతటినీ తనవైపు తిప్పుకున్న మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో యూట్యూబర్ అడిగిన వెకిలి ప్రశ్నకు మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది. తన డ్రెస్ కలర్‌పై అనవసర రాజకీయాలు ఆపాదించేలా అడిగిన ప్రశ్నపై ఈ భామ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే, చాలా స్మార్ట్‌గా ఆ వ్యక్తి నోరు మూయించింది.

Priya Prakash Varrier: కాషాయ రంగు డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో షాక్.. ఆమె రియాక్ష్ ఇలా
Priya Prakash Varrier: కాషాయ రంగు డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో షాక్.. ఆమె రియాక్ష్ ఇలా

ఇటీవల ప్రియా వారియర్ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఒక ప్రాడక్ట్ లాంచ్ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా దానికి సంబంధించిన సాఫ్రాన్ (కాషాయం) రంగు దుస్తులు ధరించి స్టేజిపై కూర్చుంది.

"కేరళలో ఆరెంజ్ అలర్ట్ కదా?".. యూట్యూబర్ వెకిలి ప్రశ్న

ఈవెంట్ జరుగుతుండగా ప్రెస్ మీట్ సెషన్‌లో ఒక యూట్యూబర్ మైక్ అందుకుని, "కేరళలో ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది కదా.. అందుకే ఈ కలర్ డ్రెస్ వేసుకొచ్చారా?" అంటూ పొలిటికల్ సెటైర్ వేసే ప్రయత్నం చేశాడు. బ్రాండ్ కలర్‌ను పక్కన పెట్టి, డ్రెస్ రంగుకు వివాదాస్పద అంశాలను జోడించడమే ఆ ప్రశ్నకు కారణం.

ఈ వింత ప్రశ్న వినగానే ప్రియా వారియర్ క్షణకాలం తీవ్రంగా షాక్ అయింది. మొదట ఆమె ముఖంలో కొంత అసహనం కనిపించినా, వెంటనే ప్రశాంతంగా తేరుకుని చురకలు అంటిస్తూ సమాధానం ఇచ్చింది.

"నా ప్రియమైన సోదరా.." అంటూ క్లాస్ పీకిన మలయాళ బ్యూటీ

"నా ప్రియమైన అన్నయ్య (ఎంటే పొన్ను చేట్టా).." అని సంబోధిస్తూ ప్రియా వారియర్ స్టేజిపైనే గట్టి క్లారిటీ ఇచ్చింది. కంటెంట్ కోసం ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదని చెప్పకనే చెప్పింది.

"గత కొన్నేళ్లుగా ఈ బ్రాండ్ అఫీషియల్ థీమ్ కలర్ ఆరెంజ్ మాత్రమే. ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ కంపెనీకి గౌరవం ఇస్తూ నేను ఈ రంగు దుస్తులు ధరించాను. దీంట్లో వేరే ఎలాంటి రాజకీయం లేదా ప్లానింగ్ లేదు" అని ప్రియా స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల మాస్ రెస్పాన్స్

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం సెలబ్రిటీలను ఇలాంటి చౌకబారు ప్రశ్నలు అడగడం ఏంటని నెటిజన్లు, ఫ్యాన్స్ ఆ యూట్యూబర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా ఎంతో హుందాగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పిన ప్రియా వారియర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లైవ్ ఈవెంట్లలో స్టార్లను టార్గెట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని మండిపడుతున్నారు.

'వింక్ గర్ల్' నుంచి టాలీవుడ్ స్టార్ వరకు

'ఒరు అడార్ లవ్' సినిమాలోని కన్ను కొట్టే వీడియోతో ఒక్క రాత్రిలోనే గ్లోబల్ సెన్సేషన్‌గా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ క్రేజ్‌తోనే వరుసగా సౌత్ ఇండియన్ భాషల్లో నటిగా అవకాశాలు దక్కించుకుంది.

తెలుగులో నితిన్ సరసన 'చెక్‌', తేజ సజ్జతో 'ఇష్క్' సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది. అంతేకాకుండా సాయి దుర్గా తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం మలయాళంతో పాటు హిందీ, కన్నడ ప్రాజెక్ట్‌లతో నిరంతరం బిజీగా ఉన్న ప్రియా వారియర్, సోషల్ మీడియాలో కూడా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో మైండ్ బ్లోయింగ్ క్రేజ్ సొంతం చేసుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More