...
...
Next Story

నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్

ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. గురువారం (అక్టోబర్ 16) ఈ సినిమా రిలీజ్ కానుండగా.. బుధవారం (అక్టోబర్ 15) మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Oct 15, 2025, 18:26:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ వస్తోంది. ఈ మూవీ పేరు మిత్ర మండలి. ప్రియదర్శి, విష్ణు, మయూర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా గురువారం (అక్టోబర్ 16) రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గురించి ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అని అంటున్నారని అతడు అనడం విశేషం.

ప్రియదర్శి ఏమన్నాడంటే?

నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్
నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్

మిత్ర మండలి మూవీ టీమ్ బుధవారం (అక్టోబర్ 15) మీడియాతో మాట్లాడింది. ఇందులో ప్రియదర్శితోపాటు నిహారిక, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ లాంటి వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సినిమాలో డ్యాన్స్ చేస్తున్నారెందుకు అని అడగగా.. కథ డిమాండ్ ను బట్టే చేస్తున్నాను తప్ప తానేదో చేసేయాలని కాదని ప్రియదర్శి అన్నాడు. అంతేకాదు ఇప్పుడు నీకు డ్యాన్స్ అవసరమా అని కూడా కొందరు అంటున్నారని అతడు చెప్పడం విశేషం.

జాతి రత్నాలులాంటి కథ వద్దని చెప్పా

జాతి రత్నాలు కథ తనకు బాగా నచ్చి చేశానని, అయితే ఆ తర్వాత 35, కోర్ట్ లాంటి భిన్నమైన కథలతో సినిమాలు చేసినట్లు ప్రియదర్శి చెప్పాడు. తాను ప్రతిసారీ డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నానని, జాతి రత్నాలులాంటి కథ ఎవరైనా చెప్పినా వద్దని అంటానని అన్నాడు. అంతేకాదు ఈ మిత్ర మండలి మూవీ జాతి రత్నాలులాగా అస్సలు ఉండదని కూడా స్పష్టం చేశాడు.

ఇక సినిమాపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించాడు. కావాలని ఎవరో నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ప్రియదర్శి అన్నాడు. ఇక ఈ సినిమాలో ఏదో ఒక క్యాస్ట్ ను కించపరిచేలా తీయలేదని, ఇది మమ్మల్నే అన్నట్లుగా ఉందని మీకనిపిస్తే ఏం చేయలేమని ప్రియదర్శి అన్నాడు.

తెలుగులో కొన్నేళ్లుగా పెద్దగా కథకు ప్రాధాన్యం లేకుండా కేవలం ఓ ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ల మధ్య జరిగే కామెడీ సీన్లతో సినిమాను నడిపించేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన జాతి రత్నాలు, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. దీంతో ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ఈ మిత్ర మండలి సినిమా వస్తోంది.

ప్రియదర్శి, విష్ణు, వెన్నెల కిశోర్ లాంటి కమెడియన్లు ఉండటంతో ఈ సినిమా కూడా కామెడీకి గ్యారెంటీ ఇస్తోంది. విజయేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe