Raakh Trailer: మీర్జాపూర్ హీరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఈ సిరీస్ ఎందుకు చూడాలంటే?
Raakh Trailer: అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ట్రైలర్ విడుదలైంది. 1970ల నాటి ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Raakh Trailer: ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లంటే ఎప్పుడూ ఇష్టమే. కరెక్ట్ గా గ్రిప్పింగ్ స్టోరీలైన్, ఊహించని మలుపులు ఉంటే చాలు, ఆ సిరీస్ను కచ్చితంగా బింజ్ వాచ్ చేస్తారు. అలాంటి భారీ అంచనాలతోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్. రీసెంట్గా రిలీజ్ అయిన రాఖ్ ట్రైలర్ ఈ సిరీస్ మీద ఆసక్తిని అమాంతం పెంచేసింది.

ఈ సిరీస్కి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్.. 'పాతాళ్ లోక్' (సీజన్ 1) డైరెక్టర్ ప్రోసిత్ రాయ్. పాతాళ్ లోక్ సిరీస్లో క్రైమ్ను ఎంత రా అండ్ డార్క్ థీమ్తో రియలిస్టిక్ గా చూపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 'రాఖ్' కూడా అదే రేంజ్లో, అంతకు మించిన ఎమోషనల్ డెప్త్తో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
1970ల ఢిల్లీ బ్యాక్డ్రాప్ (Raakh web series story explained in Telugu)
ఈ రాఖ్ వెబ్ సిరీస్ కథ 1970ల నాటి పాత ఢిల్లీ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. నగరంలో వరుసగా పిల్లలు కిడ్నాప్కి గురై, దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయి శవాలుగా దొరకడం నగరాన్ని వణికిస్తుంది.
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సబ్-ఇన్స్పెక్టర్ జయప్రకాష్ (అలీ ఫజల్) తీసుకుంటాడు. అతనికి సపోర్ట్గా కిడ్నాప్కు గురైన ఒక పిల్లాడి తల్లి మోనా (సోనాలి బింద్రే) న్యాయం కోసం చేసే పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
మీర్జాపూర్ ఇమేజ్ బ్రేక్ చేసిన అలీ ఫజల్
అలీ ఫజల్ అనగానే మనకు వెంటనే 'మీర్జాపూర్' గుడ్డు భయ్యానే గుర్తొస్తాడు. అక్కడ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్గా కనిపించిన అలీ.. ఇందులో మాత్రం ఒక సెన్సిబుల్, ఇంటెన్స్ కాప్ రోల్ చేస్తున్నాడు. కేవలం క్రైమ్ సాల్వ్ చేయడమే కాకుండా, తన తండ్రి (రాకేష్ బేడీ) తో ఉండే క్లిష్టమైన బంధం చుట్టూ అతని క్యారెక్టర్ నడుస్తుంది.
"మొదట దీన్ని రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నా, కానీ కథ చదివాక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను" అని అలీ ఫజల్ చెప్పడం ఈ సిరీస్ కంటెంట్ డెప్త్ ఏంటో చెబుతోంది.
మరోవైపు 90ల్లో గ్లామర్ క్వీన్గా వెలుగొందిన సోనాలి బింద్రే.. ఒక తల్లి పడే వేదనను ఇందులో అద్భుతంగా పండించినట్లు కనిపిస్తోంది. ఆమె సైలెంట్ స్ట్రెంత్ ఈ సిరీస్కు పెద్ద అస్సెట్. మలయాళ, హిందీ క్రైమ్ థ్రిల్లర్లను తెలుగులో చూసేవాళ్ళకి ఇది కచ్చితంగా నచ్చుతుంది.
Raakh OTT release date: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా హ్యూమన్ సైకాలజీలోని చీకటి కోణాలను టచ్ చేస్తున్న ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ దీన్ని తమ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
రాఖ్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో రానుంది? (Raakh OTT release date eppudu?)
జూన్ 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? (Is Raakh family friendly?)
లేదు, పిల్లల కిడ్నాప్లు, దారుణమైన హత్యల నేపథ్యంలో సాగే డార్క్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కాబట్టి ఫ్యామిలీతో, ముఖ్యంగా చిన్న పిల్లలతో చూడకపోవడమే మంచిది. ఇది కేవలం పెద్దల కోసం తీసిన అడల్ట్ క్రైమ్ డ్రామా.
రాఖ్ వెబ్ సిరీస్లో మెయిన్ కాస్ట్ ఎవరు?
మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించగా.. రాకేష్ బేడీ, ఆమిర్ బషీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


