సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు. శనివారం చెన్నై విమానాశ్రయంలో కనిపించిన ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఎన్నికలపై మాత్రం

సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న తలైవా రజినీకాంత్.. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న రజినీకాంత్కు రిపోర్టర్లు ఘన స్వాగతం పలికారు. వారిని చూసి నవ్వుతూ పలకరించిన ఆయన, విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఓపిగ్గా బదులిచ్చారు.
జైలర్ 2
"జైలర్ 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుంది’’ అని రజినీకాంత్ స్పష్టం చేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
దండం పెట్టి
అయితే, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. రజినీకాంత్ కామెంట్ చేసేందుకు సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల గురించి ఏమీ మాట్లాడనంటూ కేవలం "వణక్కం" అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ గా మాారింది.
రాజకీయ దుమారం
డీఎంకే పార్టీ బెదిరింపుల వల్లే రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేదంటూ ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై గత నెలలోనే రజినీకాంత్ మౌనం వీడారు. ఆదవ్ అర్జున్ వ్యాఖ్యలను ఖండిస్తూ తన సామాజిక మాధ్యమాల్లో తమిళంలో ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
{{/usCountry}}డీఎంకే పార్టీ బెదిరింపుల వల్లే రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేదంటూ ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై గత నెలలోనే రజినీకాంత్ మౌనం వీడారు. ఆదవ్ అర్జున్ వ్యాఖ్యలను ఖండిస్తూ తన సామాజిక మాధ్యమాల్లో తమిళంలో ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
{{/usCountry}}"నాపై చేసిన అవాస్తవ, నిరాధారమైన ఆరోపణలను ఖండించి, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. కాలం మాట్లాడదు, కానీ అది వేచి ఉండి సరైన సమాధానం ఇస్తుంది" అని రజినీకాంత్ ఆ లేఖలో ఘాటుగా బదులిచ్చారు.
ఎన్నికల్లో పోటీ
నిజానికి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని 2020 డిసెంబర్లోనే రజినీకాంత్ భారీ ప్రకటన చేశారు. కానీ, అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తన అనారోగ్యాన్ని "దేవుడు ఇచ్చిన హెచ్చరిక"గా భావించిన ఆయన, ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రణాళికలను పూర్తిగా రద్దు చేసుకున్నారు.
జైలర్ 2పై భారీ అంచనాలు
ఇక సినిమాల విషయానికి వస్తే.. 'కూలీ' తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రం ఈ 'జైలర్ 2'. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్గా ఈ యాక్షన్-కామెడీ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్లోనూ రజనీకాంత్ ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్గా మరోసారి విశ్వరూపం చూపించనున్నారు. ఆయన భార్య విజయ ‘విజి’ పాండియన్ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.
మొదటి భాగంలో.. విశ్రాంత జీవితం గడుపుతున్న టైగర్, ఒక స్మగ్లింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తన కొడుకు అదృశ్యమవ్వడంతో, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మళ్లీ ఎలా రంగంలోకి దిగాడనేది ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. ఇప్పుడు ఈ జైలర్ 2 లో కథను దర్శకుడు నెల్సన్ ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.