Rakul Preet Singh: మోసం చేస్తే క్షమించవచ్చా? రిలేషన్‌షిప్‌పై రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్లు.. ఇంటర్నెట్ లో వైరల్

Rakul Preet Singh: భర్త జాకీ భగ్నానీ కామెంట్స్ వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్లు చేసింది. రిలేషన్‌షిప్‌లో మోసం, ఒకే ఒక్క తప్పును క్షమించడం వంటి సున్నితమైన అంశాలపై రకుల్ కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: May 20, 2026, 13:46:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rakul Preet Singh: భర్త జాకీ భగ్నానీ తమ వైవాహిక బంధాన్ని 'సిట్యుయేషన్‌షిప్' అని పిలిచి నెట్టింట సంచలనం సృష్టించిన కొద్ది రోజులకే, నటి రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్‌షిప్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్ట్ నర్ చీటింగ్ చేస్తే లైఫ్ లో ఎలా ఉంటుంది? ఏం చేయాలి? అనే విషయాలపై రకుల్ మాట్లాడింది.

రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్లు (instagram)
రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్లు (instagram)

రిలేషన్ షిప్ లో మోసం

ఇటీవల యూట్యూబ్‌లో ప్రసారమైన 'ది బాంబే జర్నీ' టాక్ షోలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఆమెతో పాటు సహ నటీనటులు సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు మోసం చేసుకోవడం (ఇన్‌ఫిడెలిటీ), ఆ తప్పును అసలు సమర్థించవచ్చా అనే అంశంపై వీరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది.

రకుల్ కామెంట్లు

రిలేషన్‌షిప్‌లో మోసం చేయడాన్ని ఎప్పుడైనా అంగీకరించవచ్చా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. "అస్సలు కుదరదు" అని రకుల్ ఏమాత్రం తడుముకోకుండా స్పష్టం చేసింది. ఈ క్రమంలో సారా అలీ ఖాన్ జోక్యం చేసుకుంటూ.. "కనీసం సారీ అయినా చెప్పాలి. కానీ మోసం చేయడం మాత్రం కచ్చితంగా కరెక్ట్ కాదు" అని పేర్కొంది.

సారా అభిప్రాయంతో రకుల్ కూడా ఏకీభవించింది. అయితే, ఆయుష్మాన్ ఖురానా మాత్రం దీనిపై భిన్నమైన కోణాన్ని వినిపించాడు. "వివాహ బంధానికి కొన్ని సొంత నియమాలు ఉంటాయి. అదే సమయంలో అవతలి వ్యక్తి నిజాయితీగా క్షమాపణ చెబితే, ఎందుకు క్షమించకూడదు?" అని ఆయుష్మాన్ ప్రశ్నించాడు.

అది అలవాటుగా మారితే

దీనిపై రకుల్ మరింత స్పష్టత ఇస్తూ.. "అది ఏ స్థాయి తప్పు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మోసం చేయడం అనేది ఒక అలవాటుగా మారితే మాత్రం అస్సలు ఒప్పుకోలేం" అని వివరించింది. రకుల్ మాట పూర్తి కాకముందే సారా స్పందిస్తూ.. మరి ఒకే ఒక్కసారి తప్పు చేస్తే ఓకేనా? అని అడిగింది. వ్యక్తిగతంగా తనకు అది ఇష్టం లేదని చెబుతూనే, జీవితం చాలా పెద్దదని కూడా రకుల్ పేర్కొంది.

ఒకసారి పొరపాటు

"ఎవరైనా ఒకసారి పొరపాటుగా తప్పటడుగు వేస్తే, ఆ ఒక్క తప్పును క్షమించలేనంత చిన్నదేమీ కాదు జీవితం. అయితే, ఇది నా వ్యక్తిగత బంధానికి వర్తించదు. దయచేసి గమనించగలరు" అని రకుల్ నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది. ఆయుష్మాన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మనుషులు తప్పులు చేయడం సహజమని, కానీ వారు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడితే క్షమించవచ్చని అన్నాడు.

జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' వివాదం

కొద్ది రోజుల క్రితం రకుల్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ తమ వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాయి. 'జింగాబాద్' యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాము భార్యాభర్తలమే అయినప్పటికీ ఒక 'సిట్యుయేషన్‌షిప్'లో ఉన్నామంటూ, ఒకరికొకరు ఎంతో ప్రత్యేకమని, ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుకుంటామని అన్నారు.

ఈ కొత్త తరం జెన్-జీ (Gen-Z) పదాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకోవడంతో రకుల్ రంగంలోకి దిగారు. జాకీతో చెవులు పట్టుకుని సారీ చెప్పిస్తున్న ఒక సరదా వీడియోను షేర్ చేస్తూ.. "మనం మిలీనియల్స్, జెన్-జీ లాగా మారాల్సిన అవసరం లేదు" అని క్లాస్ పీకింది. దానికి జాకీ స్పందిస్తూ, తాను ఆ ఉద్దేశంతో అనలేదని నవ్వుతూ క్లారిటీ ఇచ్చాడు.

పతి పత్ని ఔర్ వో దో

రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పతి పత్ని ఔర్ వో దో' ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్ నటించిన హిట్ సినిమాకు ఇది సీక్వెల్ కాగా, 1978 నాటి సంజీవ్ కుమార్ క్లాసిక్ చిత్రానికి రీమేక్ వెర్షన్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: రిలేషన్‌షిప్‌లో మోసం చేయడంపై రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం ఏమిటి?

జవాబు: రిలేషన్‌షిప్‌లో మోసం చేయడాన్ని రకుల్ అస్సలు ఒప్పుకోదు. అయితే, అది ఒక అలవాటుగా కాకుండా, ఒకే ఒక్కసారి జరిగిన పొరపాటు అయితే జీవితంలో క్షమించవచ్చని ఆమె అభిప్రాయపడింది.

ప్రశ్న: జాకీ భగ్నానీ తమ పెళ్లిని 'సిట్యుయేషన్‌షిప్' అని ఎందుకు అన్నాడు?

జవాబు: తమ బంధంలో ఒకరికొకరు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఏ విషయమైనా మనసు విప్పి మాట్లాడుకుంటామని చెప్పే క్రమంలో జాకీ సరదాగా ఆ పదాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత రకుల్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ప్రశ్న: రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఇటీవలి చిత్రం ఏది?

జవాబు: రకుల్, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్‌లతో కలిసి నటించిన 'పతి పత్ని ఔర్ వో దో' చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More