రామ్ గోపాల్ వర్మ ఏం ట్వీట్ చేసినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అతడు తాజాగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో చేసిన ఓ మూడు నిమిషాల మూవీ క్లిప్ ను అతడు షేర్ చేస్తూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ డైరెక్టర్ చేసిన ట్వీట్లలో ఏముందో చూడండి.
ఏఐపై ఆర్జీవీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం (ఫిబ్రవరి 18) ఓ ట్వీట్ చేశాడు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేసిన ఓ సినిమా క్లిప్ ను షేర్ చేశాడు. కేవలం ఒక్క రోజులోనే తాము ఈ సినిమాను ఏఐ సాయంతో క్రియేట్ చేశామంటూ ది డోర్ బ్రదర్స్ చేసిన ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
“ఇది చూసిన తర్వాత సినిమాలకు ఇక ముగింపు వచ్చేసినట్లే అని నమ్మి తీరాల్సిందే. చివరి వరకూ చూడండి” అంటూ ఆ ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేశాడు. ఆ వీడియోలో భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాల్లో ఉండే స్థాయి విజువల్స్ ఉన్నాయి. జియో మాగ్నటిక్ తుఫాను కారణంగా భూమిపై జరిగే విధ్వంసాన్ని అందులో చూడొచ్చు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ ను ఏఐ సాయంతో కేవలం ఒక్క రోజులోనే క్రియేట్ చేసినట్లు అందులో చెప్పడం చూడొచ్చు.
ఏఐపై ఆర్జీవీ ఆందోళన
అది చూసి రామ్ గోపాల్ వర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశాడు. అసలు నటీనటులు, డైరెక్టర్ల అవసరం లేకుండానే ఇలాంటి సినిమాలను కూడా ఏఐ సాయంతో తీసేస్తుంటే ఇక సినిమాలు ఎక్కడ ఉంటాయన్న ఆందోళన ఆర్జీవీ ట్వీట్ లో కనిపించింది. ఆ ట్వీట్ కు కొనసాగింపుగా గురువారం (ఫిబ్రవరి 19) కూడా అతడు మరో ట్వీట్ చేశాడు.
{{/usCountry}}అది చూసి రామ్ గోపాల్ వర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశాడు. అసలు నటీనటులు, డైరెక్టర్ల అవసరం లేకుండానే ఇలాంటి సినిమాలను కూడా ఏఐ సాయంతో తీసేస్తుంటే ఇక సినిమాలు ఎక్కడ ఉంటాయన్న ఆందోళన ఆర్జీవీ ట్వీట్ లో కనిపించింది. ఆ ట్వీట్ కు కొనసాగింపుగా గురువారం (ఫిబ్రవరి 19) కూడా అతడు మరో ట్వీట్ చేశాడు.
{{/usCountry}}“మన ప్రపంచంలోని రెండు అతిపెద్ద సమస్యల్లో ఒకటి సహజ మూర్ఖత్వం కాగా.. మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అని ఆర్జీవీ అనడం గమనార్హం. అతని మాటలను బట్టి ఏఐ ద్వారా ప్రపంచానికి రాబోతున్న ముప్పు ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యే నటుడు రానా దగ్గుబాటి కూడా ఏఐపై స్పందిస్తూ.. చాలా త్వరగానే అది మన మనుషులందరినీ రీప్లేస్ చేయగలదని అనడం విశేషం.