S Janaki: భారత సినీ చరిత్రలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పాటలు పాడారు, ఇంకా పాడుతున్నారు. కానీ ఈ వేలాది సింగర్స్ మధ్యలో ఎప్పటికీ వెలిగిపోయే దిగ్గజాలు కొందరే ఉంటారు. ఆ దిగ్గజాల్లో అత్యంత ప్రత్యేకం మన జానకమ్మ. అందరూ పాటలు పాడతారు. కానీ ఆమెలా మాత్రం పాడలేరు.
పాటలు సజీవం

సంగీత లోకాన్ని వదిలి, ఈ ప్రపంచాన్ని విడిచి ఎస్.జానకి వెళ్లిపోయారు. శనివారం (జూలై 11) ఆమె తుదిశ్వాస విడిచారు. కానీ మరణం ఆమెను భౌతికంగానే దూరంగా చెసిందంతే. పాటల రూపంలో జానకమ్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఇక ఆమె పాడిన కొన్ని పాటలు అయితే జానకమ్మ స్పెషాలిటీని చాటి చెప్తాయి.
ఇదే జానకమ్మ స్పెషాలిటీ
సింగర్స్ ఎవరైనా ఒకే గొంతుతో పాటలు పాడతారు. అవసరానికి తగ్గట్లు శ్రుతి పెంచుతారు, తగ్గిస్తారు. కానీ గొంతును వేర్వేరు రకాలుగా మార్చి పాడటం కష్టమే. కానీ ఆ కష్టమైన పనిని చాలా సులభంగా చేశారు జానకమ్మ. ఒక పిల్లాడిగా, అమ్మాయిగా, మగాడిగా, ముసలావిడిగా తన గొంతును మార్చి మరీ పాటలు పాడిన ఘనత ఆమె సొంతం.
ఈ సాంగ్స్ అవే
జానకమ్మ ఏదో ఒకటి రెండు పాటలు మాత్రమే ఇలా గొంతు మార్చి పాడలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో 50కి పైగా పాటలను ఇలా గొంతు మార్చి పాడారు. మరే సింగర్ కు సాధ్యం కాని ఘనత ఇది. జానకమ్మ తొలిసారిగా తమిళంలో ‘కన్నా నీ ఎంగే’ అనే పాటను కిడ్ వాయిస్ లో పాడారు.
తెలుగులో అయితే సప్తపది సినిమాలోని ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన’ అనే సినిమాను అచ్చు కిడ్ వర్షన్ లో పాడి ఆశ్చర్యపరిచారు.
తెలుగులో ఇలా
{{/usCountry}}తెలుగులో అయితే సప్తపది సినిమాలోని ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన’ అనే సినిమాను అచ్చు కిడ్ వర్షన్ లో పాడి ఆశ్చర్యపరిచారు.
తెలుగులో ఇలా
{{/usCountry}}ఇంకా తెలుగులో ‘పాటంటే పాట కాదు’, ‘ఆ దీపమెలా వెలిగేది’, ‘అమ్మా నాన్న’, ‘గున్న మామిడి’, ‘రావే రావే చందమామ’, ‘హలో హలో ఓ తాతయ్య’, ‘నడిచేది జీవుడు’, ‘పుట్టింటి బొమ్మ’, ‘నీకేల కోపం శంకర’, ‘వెన్నెలైనా చీకటైనా’ అనే పాటలను పిల్లల గొంతుతో పాడారు. పిల్లల్లోనూ ఆడ, మగ వాయిస్ తో పాటలు పాడటం జానకమ్మకే చెల్లింది.
ఇవీ అద్భుతాలే
ఇక ముసలావిడ గొంతుతో ‘అలక పానుపు’, ‘కట్టు కథలు’, ‘ఎంత సోగ్గున్నావో’, ‘పోరా పోరా కృష్ణ’ అనే తెలుగు పాటలు పాడారు జానకమ్మ. టీనేజర్ వాయిస్ తో ‘పాపపేరు మల్లి’ అనే పాట పాడారు. పురుష గొంతుతో మలయాళంలో ఓ సాంగ్ పాడారు.
ఇలా ఒకే గొంతుతో వేర్వేరు వేరియేషన్స్ చూపించడం ఒక్క జానకమ్మ వల్లే సాధ్యమైంది. అందుకే ఆమె ప్రత్యేకం. ఆమె పాటలు ప్రత్యేకం. ఆమె ప్రస్థానమే ప్రత్యేకం. పాటలు ఉన్నంత కాలం జానకమ్మ గొంతు శాశ్వతం.