Samantha Weight: ఇప్పటికే 11 కిలోలు పెరిగాను.. ప్రెగ్నెన్సీని మనసారా ఎంజాయ్ చేస్తున్నా: సమంత

Samantha Weight: సమంత 11 కిలోల బరువు పెరిగిందట. తన ప్రెగ్నెన్సీని మనసారా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. తాజాగా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Aug 28, 2026, 19:38:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Weight: తల్లికాబోతున్న ఆనందంలో తేలిపోతున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ప్రెగ్నెన్సీ ఫేజ్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో తన బరువు పెరగడం, మాతృత్వం తెచ్చే మార్పులపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

Samantha Weight: ఇప్పటికే 11 కిలోలు పెరిగాను.. ప్రెగ్నెన్సీని మనసారా ఎంజాయ్ చేస్తున్నా: సమంత
Samantha Weight: ఇప్పటికే 11 కిలోలు పెరిగాను.. ప్రెగ్నెన్సీని మనసారా ఎంజాయ్ చేస్తున్నా: సమంత

"11 కిలోలు బరువు పెరిగాను" - సమంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్ AMA సెషన్‌లో "కొత్తగా అమ్మ అవుతున్న వాళ్లు ఎలా ఉన్నారు?" అని సమంత ప్రయాణం గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒక ఫ్యాన్ "బరువు బాగా పెరుగుతున్నాను" అని రిప్లై ఇవ్వగా, సమంత స్పందిస్తూ "నాకు ఆ ఫీలింగ్ బాగా అర్థమవుతోంది.. నేను కూడా ఇప్పటికే 11 కిలోల బరువు పెరిగాను" అని తన ప్రెగ్నెన్సీ హెల్త్ అప్‌డేట్ షేర్ చేశారు.

మరొక అభిమాని "పిల్లలకు పాలు పట్టడం, వాళ్లను లాలించడం, జోకొట్టడం.. రోజంతా ఇదే సరిపోతోంది" అని కామెంట్ చేయగా.. "అది వింటుంటేనే ఒక ఫుల్ టైమ్ జాబ్ లా అనిపిస్తోంది" అని సమంతా కామెంట్ చేశారు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ తనలో ఒక కొత్త శక్తిని నింపిందని, మొదట్లో భయపడతాననుకున్నాను కానీ ఇప్పుడు చాలా ఎంపవర్డ్‌గా ఫీలవుతున్నానని చెప్పారు.

వియత్నాంలో బేబీమూన్ వెకేషన్ హంగామా

సమంత రీసెంట్‌గా భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియత్నాం వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బేబీ బంప్‌తో డిన్నర్ డేట్స్‌కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రెగ్నెన్సీ గ్లోతో సమంతా మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మొదటి నుంచి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే సమంతా, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతూ తన ఫ్యాన్స్‌కు స్పూర్తిగా నిలుస్తున్నారు.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నుంచి మొదలైన ప్రేమ కథ

సమంత, రాజ్ నిడిమోరు కాంబినేషన్‌లో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' లాంటి గ్లోబల్ వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ల సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, 2025లో కోయంబత్తూర్ ఇషా యోగా సెంటర్‌లో సాంప్రదాయ యోగిక్ పద్ధతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

గతంలో నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంతా, రాజ్ నిడిమోరు రూపంలో మళ్లీ ఒక మంచి తోడును కనుగొని కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు.

రూ.100 కోట్ల క్లబ్‌లో 'మా ఇంటి బంగారం'..

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించి, స్వయంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక ఫిమేల్ సెంట్రిక్ తెలుగు సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి.

ఈ భారీ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాతే సమంత తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన సమంత.. తల్లి అయిన తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌లతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

సమంత రూత్ ప్రభు కామెంట్స్
సమంత రూత్ ప్రభు కామెంట్స్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More