బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల రియాద్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘జాయ్ అవార్డ్స్ 2026’ కార్యక్రమానికి వెళ్లాడు. ఈ ఈవెంట్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందులో ఓ అభిమానితో కింగ్ ఖాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టేజ్ మీద సెల్ఫీ.. షారుఖ్ ఏం చేశాడంటే?

వైరల్ అవుతున్న వీడియోలో.. షారుక్ ఖాన్ వేదికపై ఉండగా అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ తీసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. వెంటనే షారుక్ నవ్వుతూ ఆ వ్యక్తి చేతిలోని ఫోన్ను సున్నితంగా పక్కకు తీసి, ఎదురుగా ఉన్న ప్రొఫెషనల్ కెమెరామెన్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ట్రోఫీ అందించి, అధికారిక ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. మరో వ్యక్తి కూడా సెల్ఫీకి ప్రయత్నించగా, షారుక్ అతన్ని కూడా కెమెరా వైపు చూడమని సూచించాడు.
అహంకారమా? ప్రోటోకాలా?
షారుక్ ఖాన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది షారుక్ అహంకారం అని విమర్శిస్తుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
"అవార్డు తీసుకునేటప్పుడు స్టేజ్ మీద సెల్ఫీలు దిగడం పద్ధతి కాదు. అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వారి వైపు చూస్తేనే మంచి ఫోటోలు వస్తాయి. షారుక్ కేవలం ప్రోటోకాల్ పాటించారు. ఆ వ్యక్తికి కూడా అదే నేర్పించారు" అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
"ఆస్కార్ లేదా ఐఫా వంటి పెద్ద వేదికలపై ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటారా? షారుక్ తన విధిని నిర్వర్తించారు అంతే" అని మరికొందరు సమర్థిస్తున్నారు.
జాయ్ అవార్డ్స్ సందడి..
ఈ కార్యక్రమంలో షారుక్ తో పాటు మిల్లీ బాబీ బ్రౌన్, కేటీ పెర్రీ, లీ జంగ్-జే వంటి అంతర్జాతీయ తారలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ గ్రాండ్గా జరిగిందని, తనను ఆహ్వానించినందుకు సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కి అలల్షీక్కు షారుక్ ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
కింగ్ సినిమా విశేషాలు
{{/usCountry}}ఈ కార్యక్రమంలో షారుక్ తో పాటు మిల్లీ బాబీ బ్రౌన్, కేటీ పెర్రీ, లీ జంగ్-జే వంటి అంతర్జాతీయ తారలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ గ్రాండ్గా జరిగిందని, తనను ఆహ్వానించినందుకు సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కి అలల్షీక్కు షారుక్ ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
కింగ్ సినిమా విశేషాలు
{{/usCountry}}షారుక్ ఖాన్ తదుపరి మూవీ ‘కింగ్’ (King). సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారుక్ కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.