స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన నెక్ట్స్ మూవీ తెలుసు కదా. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సోమవారం (అక్టోబర్ 13) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రొమాంటిక్ మూవీ అయినా కూడా ఇందులో ఒక్క కిస్ సీన్ కూడా లేదని అతడు అనడం విశేషం.
ఫిజికల్ ఇంటమసీ కాదు..

సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా. సిద్దూ నటించిన చివరి సినిమా జాక్ దారుణంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో అతడు ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ తెలుసు కదా సినిమా గురించి ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు చాలానే ఉన్నట్లున్నాయి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
దీనికి సిద్దూ జొన్నలగడ్డ స్పందిస్తూ.. రొమాంటిక్ మూవీ అయినప్పుడు ఉంటాయి కదా అని మొదట స్పందించాడు. కానీ ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. నిజానికి ఇందులో ఒక్క కిస్ సీన్ కూడా లేదని చెప్పడంతో అక్కడి ఆడియెన్స్ అరిచారు. సినిమాను ప్రారంభించే సమయంలోనే నీరజ దగ్గరికి వెళ్లి ఇందులో కిస్ సీన్లు ఉండొద్దని చెప్పినట్లు సిద్దూ వెల్లడించాడు. ఈ సినిమాలో ఫిజికల్ ఇంటిమసీ కంటే ఎమోషనల్ ఇంటిమసీ ఎక్కువని చెప్పాడు. ఒక్క కిస్ సీన్ లేకపోయినా.. ఇంటర్వెల్ సీన్ లో మీకు చాలా ఎక్కువ ఫీలింగ్ కలుతుందని సిద్దూ చెప్పాడు.
ఇక మరో జర్నలిస్ట్ స్పందిస్తూ.. ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అని ప్రశ్నించారు. దీనికి సిద్దూ స్పందిస్తూ.. ఇది కేవలం రెండో సినిమానే అని, టిల్లూ స్క్వేర్ లో కాసేపు మాత్రమే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అన్నాడు.
తెలుసు కదా మూవీ గురించి..
తెలుసు కదా సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. నీరజ కోన డైరెక్ట్ చేయగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 17) రిలీజ్ కాబోతోంది. అయితే ట్రైలర్ మాత్రం పెద్ద ఇంట్రెస్టింగా ఏమీ అనిపించలేదని అభిమానులు అంటున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటన్నది మూవీ చూస్తేనే తెలియనుంది.
{{/usCountry}}తెలుసు కదా సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. నీరజ కోన డైరెక్ట్ చేయగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 17) రిలీజ్ కాబోతోంది. అయితే ట్రైలర్ మాత్రం పెద్ద ఇంట్రెస్టింగా ఏమీ అనిపించలేదని అభిమానులు అంటున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటన్నది మూవీ చూస్తేనే తెలియనుంది.
{{/usCountry}}