Sign in

Sing Geetham Movie Review: 94 ఏళ్ల వయసులో సింగీతం సృష్టించిన మ్యూజికల్ వండర్.. 'సింగ్ గీతం' ఎలా ఉందంటే?

Sing Geetham Movie Review: అద్భుతాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన వినూత్న మ్యూజికల్ ఫాంటసీ 'సింగ్ గీతం'. నాగ్ అశ్విన్ నిర్మాణంలో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 12) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇది ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Published on: Jun 12, 2026, 17:22:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sing Geetham Movie Review: తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సింగీతం శ్రీనివాసరావు. 'ఆదిత్య 369', 'పుష్పక విమానం', 'భైరవద్వీపం' లాంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ అందించిన ఈ లెజెండరీ డైరెక్టర్.. 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు.

Sing Geetham Movie Review: 94 ఏళ్ల వయసులో సింగీతం సృష్టించిన మ్యూజికల్ వండర్.. 'సింగ్ గీతం' ఎలా ఉందంటే?
Sing Geetham Movie Review: 94 ఏళ్ల వయసులో సింగీతం సృష్టించిన మ్యూజికల్ వండర్.. 'సింగ్ గీతం' ఎలా ఉందంటే?

ఆయన తన ఇంటిపేరు కలిసివచ్చేలా రూపొందించిన సరికొత్త జోనర్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ 'సింగ్ గీతం' (Sing Geetham). 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించగా, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో చూడండి.

Sing Geetham Plot | కుబేరపురం చుట్టూ తిరిగే కథ

ఆంధ్రప్రదేశ్‌లోని 'కుబేరపురం' అనే ఒక ఊహాజనిత ఊరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఆ ఊరిలో బ్రహ్మయ్య (బెనర్జీ) కి చెందిన ఒక గోల్డ్ మైనింగ్ కంపెనీ ఉంటుంది. ఆ బిజినెస్ బాధ్యతలను ఆయన కూతురు రేణు (షాలిని కొండిపూడి) చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రతాప్ (అయాన్) అనే యంగ్ బిజినెస్ పార్టనర్ ఆ ఊరికి వస్తాడు. అదే గ్రామంలో ఉండే గౌరి (అహిల్యా బమ్రూ) అనే అమ్మాయి ఈ మైనింగ్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ ఊరిలో మిగిలి ఉన్న ఏకైక పవిత్రమైన చెట్టును ఆమె తన ప్రాణంకంటే ఎక్కువగా కాపాడుకుంటూ ఉంటుంది.

కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ చెట్టును నరికేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన గౌరి.. గ్రామ దేవత అయిన కుబేరుడిని వేడుకుంటుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో కొన్ని వింత సంఘటనలు, ఊహించని పరిణామాలు మొదలవుతాయి. గ్రామస్తులంతా ఏదో శాపానికి గురయ్యామని భయపడతారు. ఆ వింత పరిస్థితుల నుంచి కుబేరపురం ప్రజలు ఎలా బయటపడ్డారు? తమ తప్పును ఎలా తెలుసుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.

మాటలే పాటలైన వినూత్న ప్రయోగం!

యాక్షన్, రక్తపాతం, క్రూరత్వంతో కూడిన సినిమాలు నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో.. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస రావు ఇంతటి అద్భుతమైన ఫాంటసీ కథను ఎంచుకుని తెరకెక్కించిన తీరు నిజంగా గ్రేట్. దశాబ్దాల నాటి పాయింట్ తీసుకున్నప్పటికీ.. నేటి తరం ఆడియన్స్ కు తగినట్లుగా చాలా తాజాగా ప్రెజెంట్ చేశారు. ఆయన ఎందుకు ఇండస్ట్రీలోనే మోస్ట్ క్రియేటివ్ రైటరో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది.

ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ దాని స్క్రీన్‌ప్లే, కథ సాగే విధానం. సాధారణంగా సినిమాల్లో డైలాగులు ఉంటాయి.. కానీ ఈ చిత్రంలో పాత్రల మధ్య జరిగే డైలాగ్స్ అన్నీ పాటల రూపంలోనే సాగుతాయి. ఇది తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ చలనచిత్ర రంగానికి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి మాటలోనూ ఒక అద్భుతమైన మ్యూజికల్ లయ కనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ మ్యాజిక్.. డీఎస్‌పీ సంగీతం

సినిమా ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా, వేగంగా సాగుతుంది. గ్రామానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సీన్లు బాగా పండాయి. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే.. గౌరి పాత్రలో అహిల్యా బమ్రూ అద్భుతంగా నటించింది. స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తూ హావభావాలతో మెప్పించింది. ప్రతాప్ పాత్రలో అయాన్ చాలా హుందాగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో షాలిని కొండిపూడి నటన బాగుంది. చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించిన నివేదా పేతురాజ్, తన పరిమిత స్క్రీన్ టైమ్‌లోనే మంచి ఇంపాక్ట్ చూపించింది.

ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతం ఒక పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. పాత్రల మాటలనే పాటలుగా మార్చే ప్రాసెస్ చాలా కష్టమైనది. కానీ దేవిశ్రీ దీనిని ఎంతో సులువుగా, అద్భుతంగా మలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా స్థాయిని పెంచింది. అంకుర్ సంజీవి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

అందరికీ నచ్చుతుందా?

ఇలాంటి సరికొత్త ప్రయోగాత్మక కథన శైలి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే అందరు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. పాత్రలు మాటలకు బదులు ఎప్పుడూ పాటల రూపంలోనే మాట్లాడుకోవడం చూసి అలవాటు పడటానికి ఆడియన్స్ కు కాస్త టైమ్ పడుతుంది. కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, వినూత్న కథనం వల్ల కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది.

హెచ్‌టీ విశ్లేషణ

'సింగ్ గీతం' అనేది ఒక వినూత్నమైన, చక్కటి సందేశంతో కూడిన మ్యాజికల్ ఫాంటసీ మూవీ. రొటీన్ మాస్, వయొలెన్స్ సినిమాలతో విసిగిపోయిన వాళ్లకు ఈ సినిమా ఒక మంచి రిలీఫ్ ఇస్తుంది.

సింగీతం శ్రీనివాసరావు విజన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లలో చూడదగ్గ ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది.

People Also Ask (FAQs)

'సింగ్ గీతం' సినిమా ప్రత్యేకత ఏమిటి?

ఈ సినిమాలో క్యారెక్టర్స్ మధ్య జరిగే డైలాగ్స్ అన్నీ సాధారణ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలోనే సాగుతాయి. ఇది టాలీవుడ్ లోనే సరికొత్త ప్రయోగం.

సింగ్ గీతం సినిమా దర్శకుడు ఎవరు?

టాలీవుడ్ లెజెండరీ ప్రయోగాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన వయసు 94 ఏళ్లు.

'సింగ్ గీతం' సినిమాను ఎవరు నిర్మించారు?

'కల్కి 2898 ఏడీ' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించగా, సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పించారు.

సింగ్ గీతం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజికల్ స్కోర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More