స్మృతి మంధానాను కాబోయే భర్త మోసం చేశాడా? మరో అమ్మాయితో చాట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. సోషల్ మీడియాలో రచ్చ
స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలుసు కదా. అయితే దీని తర్వాత వచ్చిన వార్తలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. స్మృతిని పలాష్ మోసం చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటం విశేషం.
ఫిల్మ్మేకర్, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్, ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానల పెళ్లి వాయిదా పడిన విషయం తెలుసు కదా. ఆదివారం అంటే నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో వీళ్ల పెళ్లి జరగాల్సింది. అయితే ఇటు స్మృతి తండ్రి, అటు పలాష్ ఇద్దరూ అనారోగ్యం బారిన పడటంతో వాయిదా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

అయితే స్మృతి మరుసటి రోజే పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను ఇన్స్టా నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమెను పలాస్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
వైరల్ అయిన రెడిట్ స్క్రీన్షాట్లు
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా తర్వాత మేరీ డి’కోస్టా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రెడిట్లో కొన్ని స్క్రీన్షాట్లను షేర్ చేశారు. అవి పలాష్ ముచ్చల్తో తాను చేసిన చాటింగ్ అంటూ ఆ యూజర్ పేర్కొన్నారు. ఆ అకౌంట్ ప్రస్తుతం డీయాక్టివేట్ అయినప్పటికీ, ఆ స్క్రీన్షాట్లు మాత్రం వివిధ ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి.
మే 2025 నాటి ఈ సందేశాలలో.. మేరీని పలాష్ స్విమ్మింగ్కు వెళ్లమని అడగడం కనిపిస్తుంది. ఆమె అతని రిలేషన్షిప్ స్టేటస్ గురించి లేదా అతను ప్రేమలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పలాష్ ఆ ప్రశ్నలను తప్పించుకున్నట్లుగా వాటిలో కనిపిస్తోంది. అంతేకాదు ఆమెను కలవడానికి ఒప్పించడానికి ప్రయత్నించాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇలా..
ఈ స్క్రీన్షాట్లు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. స్మృతికి మద్దతుగా చాలా మంది కామెంట్స్ చేశారు. "ఇవి చదవగానే అసహ్యం వేసింది. మనుషులు ఇంత సిగ్గులేకుండా ఉంటారా" అని ఒకరు కామెంట్ చేశారు. "ఇతను తన చేతిపై ఆమె ఇనీషియల్స్, జెర్సీ నంబర్ టాటూ వేయించుకున్నాడు. ఆమె ఎప్పుడూ తనను అనుమానించకుండా మోసం చేసుకునేందుకు ఇలా చేసినట్లున్నాడు" అని మరొకరు విమర్శించారు.
ఇలాంటి అబద్ధాల కోరు, మోసగాడి నుంచి స్మృతి తప్పించుకున్నందుకు ఆమె అదృష్టవంతురాలు అని ఇంకో యూజర్ అన్నారు. ఈ రోజుల్లో ప్రేమ ఓ జోక్ మాత్రమే.. చాలా మంది ఇన్స్టాలో నటిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు.
స్మృతి ఇప్పటికే తన సోషల్ మీడియా నుండి నిశ్చితార్థం, ప్రపోజల్ వీడియోలను తొలగించింది. అటు స్మృతి టీమ్మేట్ జెమీమా కూడా తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియోను డిలీట్ చేసింది. పలాష్ మాత్రం తన ఖాతాలో స్మృతితో ఉన్న పోస్ట్లన్నింటినీ అలాగే ఉంచాడు. పెళ్లి వాయిదా పడటంపై పలాష్ సోదరి పలక్ ముచ్చల్ మాత్రమే అధికారిక ప్రకటన చేసింది. "స్మృతి తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా స్మృతి, పలాష్ వివాహం నిలిపివేశాం. ఈ సమయంలో కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము" అని ఆమె కోరింది. స్మృతి లేదా పలాష్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













