Rajeev Kanakala: స్కూలు వివాదంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. గెస్టుగా మాత్రమే వెళ్లానంటూ వీడియో రిలీజ్
Rajeev Kanakala: వైబ్రెంట్ స్కూల్లో జరిగిన ఘటనపై వస్తున్న వార్తలపై నటుడు రాజీవ్ కనకాల స్పందించారు. విద్యార్థుల భద్రతే మాకు ముఖ్యమని చెబుతూ, అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Rajeev Kanakala: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక వివాదానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల వైబ్రెంట్ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమానికి తాను హాజరవడంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు రాజీవ్ కనకాల స్వయంగా రంగంలోకి దిగారు.

అసలేం జరిగింది?
వైబ్రెంట్ స్కూల్లో జరిగిన ఒక ఈవెంట్ కు రాజీవ్ కనకాల హాజరయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ స్కూలు ఈవెంట్ కు రావడం ఏంటని నవ తెలంగాణ శక్తి అధ్యక్షుడు పవన్ ఆయనను నిలదీశారు. దీనిపై తాజాగా ఓ వీడియో ద్వారా రాజీవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
"వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందనే దానిపై కొన్ని అపోహలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నాను," అని ఆయన పేర్కొన్నారు.
స్పష్టతనిస్తూ సోషల్ మీడియా పోస్ట్
ఈ వివరణాత్మక వీడియోతో పాటు ఆయన ఒక పోస్ట్ను కూడా షేర్ చేశారు. "వైబ్రెంట్ స్కూల్లో జరిగిన తాజా సంఘటనకు సంబంధించి ఈ చిన్న వివరణ ఇస్తున్నాను. తల్లిదండ్రులందరికీ ఇది నా ముఖ్య గమనిక. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. విద్యార్థుల సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ మా మొదటి ప్రాధాన్యత," అని రాసుకొచ్చారు.
రాజీవ్ కనకాల ఇలా నేరుగా స్పందించడంతో మెజారిటీ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడాన్ని నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.
“ఆ స్కూల్లో పాసైన విద్యార్థులకు సన్మాన, సత్కారాల కోసమే నేను వెళ్లాను. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విషయం నాకు నిజంగానే తెలియదు. అది తెలిసిన తర్వాత నాకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ వాడొద్దని ఆ స్కూల్ వాళ్లకు స్పష్టం చేశాను. అలాగే ఆ స్కూల్లో పిల్లలను చేర్చే పేరెంట్స్ అందరూ పూర్తిగా విచారించిన తర్వాతే ఆ పని చేయాలి” అంటూ ఆ వీడియోలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
రాజీవ్ కనకాల ఏ స్కూల్ వివాదంపై స్పందించారు?
హైదరాబాద్లోని వైబ్రెంట్ స్కూల్ (Ybrant School) లో జరిగిన ఒక కార్యక్రమం, దానికి సంబంధించి చెలరేగిన వివాదంపై స్పందించారు.
ఈ వివాదంపై రాజీవ్ ఎందుకు వివరణ ఇచ్చారు?
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ కు హాజరవడంపై రాజీవ్ కనకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు సోషల్ మీడియా ద్వారా వీడియోలో వివరణ ఇచ్చాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


