...
...
Next Story

ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దివంగత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. జయకృష్ణను ఆర్ఎక్స్ 100, మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి హీరోగా లాంచ్ చేయనున్నాడు.

Published on: Jun 8, 2025, 10:42:30 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. దివంగత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.

రెండు బ్లాక్ బస్టర్స్‌తో

ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!
ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!

ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా తెరకెక్కించినున్నారని తాజా సమాచారం. ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీతో మళ్లీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవారం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి.

కొత్త హీరోను లాంఛ్

మంగళవారం 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే మరో హై-ప్రొఫైల్ లాంఛింగ్ ప్రాజెక్ట్‌కి అజయ్ భూపతి శ్రీకారం చుట్టారు. ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరోను అజయ్ భూపతి లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.

రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు

ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

లండన్‌లో శిక్షణ

అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్‌పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది.

పర్యవేక్షిస్తున్న మహేష్ బాబు

జయకృష్ణ లాంఛ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేశ్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe