తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒక రోజు ముందే వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఓ పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

Published on: Dec 04, 2025 9:03 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి లేటెస్ట్‌గా వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. నిజానికి శుక్రవారం (డిసెంబర్ 5) స్ట్రీమింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి
తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

కుట్రమ్ పురింధవన్ ఓటీటీ స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో తరచుగా చాలా వరకు వెబ్ సిరీస్ ఈ జానర్లోనే తెరకెక్కిస్తుంటారు. అలా తమిళం నుంచి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ఈ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. ఈ సిరీస్ ను సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో చూడొచ్చు. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. సెల్వమణి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో పశుపతి, విదార్థ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళిలాంటి వాళ్లు నటించారు.

కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ కథ ఇదీ..

కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ ఓ పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. సిరీస్ మొదట్లోనే ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటం, అతని 12 ఏళ్ల కూతురు కనిపించకుండాపోవడం చూడొచ్చు. ఆ వ్యక్తికి సాయం చేయాలని చూసి భాస్కర్ (పశుపతి) అనే వ్యక్తి ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

చేసిన తప్పు దాచి పెట్టలేనంత పెద్దది అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై ఉంచడం చూస్తుంటే.. పాప మిస్సింగ్ కేసు వెనుక ఉన్న మిస్టరీ ఎలాంటిదన్నది ఊహించుకోవచ్చు. ఈ కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. 35 నుంచి 40 నిమిషాల నిడివితో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ను అవినాష్ హరిహరణ్, అరబ్బి ఆత్రేయ, సెంథిల్ వీరసామి నిర్మించారు. ఈ సిరీస్ ను తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళంలలోనూ తీసుకురావడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.