ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఈ తెలుగు కామెడీ మూవీ చూశారా.. రికార్డులు తిరగరాస్తోంది.. ఇక్కడ చూసేయండి
నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు కామెడీ మూవీ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ రవిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. కామెడీకి కాస్త ఎమోషనల్ కంటెంట్ జోడించి వచ్చిన మూవీ ఇది.
ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయింది. రవిబాబు డైరెక్ట్ చేసి, అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఓ అరుదైన స్ట్రీమింగ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఏనుగుతొండం ఘటికాచలం రికార్డు వ్యూస్
లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“కడుపుబ్బా నవ్వించే బ్లాక్బస్టర్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్తో.. ఏనుగు తొండం ఘటికాచలం ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. విన్ ఒరిజినల్ ఫిల్మ్. కేవలం ఈటీవీ విన్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.
ఏనుగుతొండం ఘటికాచలం మూవీ ఇలా..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన రవిబాబు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రవిబాబు తన కెరీర్లో భిన్నమైన పాత్రలు పోషించడమే కాదు.. భిన్నమైన సినిమాలూ తీశాడు. అల్లరి, అనసూయ, అమరావతి, అవునులాంటి మూవీస్ తో పాపులర్ అయ్యాడు. చివరిగా నాలుగేళ్ల కిందట క్రష్ అనే మూవీ తీశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఏనుగు తొండం ఘటికాచలం సినిమా తీశాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తోపాటు టీవీ యాంకర్ వర్షిణి సౌందరాజన్, పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు నటించారు.
ఓ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. 65 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునే ఘటికాచలం అనే వ్యక్తి పాత్రలో నరేష్ నటించాడు. ఆ వయసులో ఇంట్లో పని మనిషిని పెళ్లి చేసుకోవడంతో అతని కొడుకులు, కోడళ్లు మండిపడతారు. అనుకోకుండా ఓరోజు చనిపోవడంతో అతని పేరు మీద లేని ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి, ఆ డబ్బును తీసుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఘటికాచలం నిజంగానే చనిపోతాడా? చివరికి ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


