మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓ తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత డైరెక్టర్ రవి బాబు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది.

Published on: Nov 12, 2025 3:54 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈవారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల్లో తెలుగు కామెడీ ఎంటర్టైనర్ అయిన ఏనుగు తొండం ఘటికాచలం కూడా ఉంది. రవి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్
మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్

ఏనుగు తొండం ఘటికాచలం ఓటీటీ రిలీజ్

టాలీవుడ్ లో డైరెక్టర్ రవి బాబు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కామెడీతోపాటు థ్రిల్లర్ సినిమాలనూ తీస్తూ వెళ్తున్నాడు. అయితే నాలుగేళ్ల తర్వాత అతడు ఇప్పుడు మళ్లీ ఈ ఏనుగు తొండం ఘటికాచలం మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (నవంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని బుధవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“ఏనుగు తొండం ఘటికాచలం.. ఎ విన్ ఒరిజినల్ ఫిల్మ్.. రవి బాబు రాసి, డైరెక్ట్ చేసిన మూవీ.. నవంబర్ 13 నుంచి కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాను కొన్నాళ్లుగా ఆ ఓటీటీ ప్రమోట్ చేస్తోంది.

ఏనుగు తొండం ఘటికాచలం గురించి..

నటుడు, డైరెక్టర్ అయిన రవి బాబు తన కెరీర్లో భిన్నమైన పాత్రలు పోషించడమే కాదు.. భిన్నమైన సినిమాలూ తీశాడు. అల్లరి, అనసూయ, అమరావతి, అవునులాంటి మూవీస్ తో పాపులర్ అయ్యాడు. చివరిగా నాలుగేళ్ల కిందట క్రష్ అనే మూవీ తీశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఏనుగు తొండం ఘటికాచలం సినిమా తీశాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తోపాటు టీవీ యాంకర్ వర్షిణి సౌందరాజన్, పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు నటించారు.

ఓ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీసినట్లు పోస్టర్ తోనే స్పష్టమవుతోంది. గత వారం ట్రైలర్ రిలీజ్ చేశారు. 65 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునే ఘటికాచలం అనే వ్యక్తి పాత్రలో నరేష్ నటించాడు. తన పెన్షన్, ఆస్తి కోసం చూస్తున్న ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకొని గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు ట్రైలర్ లో చూపిస్తారు.

News/Entertainment/మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్
News/Entertainment/మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్