షాకింగ్.. ఓటీటీలోకి కాదు థియేటర్లలోకి వస్తున్న శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చివరి నిమిషంలో మారిన ప్లాన్!

సీనియర్ నటుడు శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 12న ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఓటీటీ రిలీజ్ ఆపేసి, థియేటర్లలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

Published on: Feb 11, 2026 7:17 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో రిలీజ్ కావాల్సిన మూవీ చివరి నిమిషంలో థియేటర్లలోకి వెళ్తుండటం విశేషం. '#90s' వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిన నటుడు శివాజీ వరుస విజయాలతో దూసుకుపోతూ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రానున్నాడు. అతడు ప్రధాన పాత్రలో, నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన తాజా సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' (Sampradayini Suppini Suddapoosani). దాదాపు దశాబ్దం తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఒక అనూహ్యమైన మార్పు జరిగింది.

షాకింగ్.. ఓటీటీలోకి కాదు థియేటర్లలోకి వస్తున్న శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చివరి నిమిషంలో మారిన ప్లాన్!
షాకింగ్.. ఓటీటీలోకి కాదు థియేటర్లలోకి వస్తున్న శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చివరి నిమిషంలో మారిన ప్లాన్!

ఓటీటీకి గుడ్ బై.. థియేటర్లకు వెల్కమ్!

ముందుగా ప్రకటించిన ప్రకారం.. ఈ సినిమా గురువారం అంటే ఫిబ్రవరి 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. దీన్ని ఒక 'డైరెక్ట్ టు ఓటీటీ' మూవీగానే ప్రమోట్ చేశారు. కానీ స్ట్రీమింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయం ఉందనగా నిర్మాతలు యూ-టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కారణం ఏంటంటే?

ఈ సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత, కొంతమంది సినీ ప్రముఖులు శివాజీకి సలహా ఇచ్చారట. "ఇది చిన్న స్క్రీన్‌పై కంటే వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. థియేటర్లలో మంచి విజయం సాధించే సత్తా ఈ కంటెంట్‌కు ఉంది" అని సూచించారట. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికి కూడా ఇది కేవలం ఓటీటీ సినిమాగా అనిపించలేదు. దీంతో నిర్మాత అయిన శివాజీ.. ఈటీవీ విన్ ఒప్పందాన్ని పక్కనపెట్టి థియేటర్ రిలీజ్ వైపు మొగ్గు చూపాడు.

రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

తాజా సమాచారం ప్రకారం.. ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను మార్చి 6న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ట్రైలర్ రిలీజ్ చేసినా గత కొన్ని రోజులుగా ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ మూవీ ప్రమోషన్లు చేయడం లేదు.

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఒక ఊరి సర్పంచ్ (శివాజీ) అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భార్య (లయ), కొడుకుతో కలిసి ఒక రోడ్ ట్రిప్ మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సవాళ్లు, వాటిని వారు ఎలా అధిగమించారు అనేదే కథ. మధ్యతరగతి ఎమోషన్స్, కామెడీ మేళవింపుతో ఈ సినిమా ఉండబోతోంది.

ఏది ఏమైనా ఓటీటీలో వస్తుందనుకున్న సినిమా ఇలా సడన్‌గా థియేటర్లకు మలుపు తిరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శివాజీ తీసుకున్న ఈ రిస్క్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.