నేరుగా ఓటీటీలోకి శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ లాంచ్ చేయనున్న అనిల్ రావిపూడి.. ఆ హిట్ వెబ్ సిరీస్‌ డైలాగే టైటిల్

ఓటీటీలోకి నేరుగా ఓ తెలుగు కామెడీ మూవీ వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ 90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లోని ఫేమస్ డైలాగ్ సాంప్రాదాయిని సుప్పిని సుద్దపూసని అనే టైటిల్ తోనే వస్తుండటం విశేషం.

Published on: Feb 06, 2026 10:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే డైలాగ్ గుర్తుందా? ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ #90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటుడు రోహన్ కి బ్యాక్‌గ్రౌండ్ లో తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడిదే టైటిల్ తో అదే ఓటీటీలోకి నేరుగా ఓ మూవీ వస్తోంది. దీని ట్రైలర్ ను అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం.

నేరుగా ఓటీటీలోకి శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ లాంచ్ చేయనున్న అనిల్ రావిపూడి.. ఆ హిట్ వెబ్ సిరీస్‌ డైలాగే టైటిల్
నేరుగా ఓటీటీలోకి శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ లాంచ్ చేయనున్న అనిల్ రావిపూడి.. ఆ హిట్ వెబ్ సిరీస్‌ డైలాగే టైటిల్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ లాంచ్

ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ మూవీగా వస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ ను శనివారం (ఫిబ్రవరి 7) లాంచ్ చేయబోతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుండగా.. ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది.

ఈ మూవీలో సీనియర్ నటుడు శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ కొన్ని రోజులుగా ఈటీవీ విన్ ఓటీటీ మూవీని ప్రమోట్ చేస్తుంది. నిజానికి రెండు రోజుల కిందటే ట్రైలర్ ను తీసుకొస్తామని చెప్పినా.. ఇంకా లాంచ్ చేయలేదు. తాజాగా శనివారం లాంచ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ మరోసారి వెల్లడించింది.

“ఎక్సైట్‌మెంట్ మరింత పెరిగింది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ ను రేపు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయనున్నాడు. విన్ ఒరిజిన్ ఫిల్మ్ ఫిబ్రవరి 12న ప్రీమియర్ కానుంది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మ్యాడ్‌నెస్ కు సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని విశేషాలు

ఈ సినిమాకు సంబంధించిన రెండు ప్రధాన విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్‌తో అలరిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇది చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హీరో శివాజీ 'శ్రీరామ్' అనే పంచాయితీ సెక్రటరీ పాత్రలో కనిపిస్తాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సాగిపోతున్న అతని జీవితం.. ఒక నేరంతో ఎలా ముడిపడింది? దానివల్ల అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. టైటిల్ చూస్తే సంప్రదాయంగా అనిపిస్తున్నా, కథలో క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కామెడీ గ్యాంగ్ రెడీ..

ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ.. స్టార్ల విషయంలో రాజీ పడలేదు. అలీ, ధన్‌రాజ్, రఘు బాబు, రోషన్ వంటి ప్రముఖ హాస్య నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ల రాకతో సినిమాలో వినోదానికి కొదవలేదని అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. చాలా కాలం తర్వాత శివాజీ, లయలను ఒకేసారి స్క్రీన్‌పై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.